News April 13, 2025
వీఆర్ పురం : ఉరివేసుకుని బాలిక మృతి

వీఆర్ పురం మండలం జీడిగుప్పలో శనివారం 15 ఏళ్ల బాలిక చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు ఎస్సై సంతోశ్ కుమార్ తెలిపారు. చింతూరు మండలం వెదుళ్లపల్లికి చెందిన బాలిక కుటుంబం మిరప తోటల్లో పని చేయడానికి నెల రోజుల క్రితం జీడిగుప్ప వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లి పోదామని బాలికతల్లిని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్సై తెలిపారు.
Similar News
News November 12, 2025
నరసరావుపేట: ఎలుకల నివారణ గోడపత్రికల ఆవిష్కరణ

సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో రైతులందరూ భాగస్వాములై తమ పంటలను ఎలుకల బారినుంచి కాపాడుకోవాలని కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ అధ్వర్యంలో సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమంపై గోడపత్రికలు ఆవిష్కరించారు. జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ద్వారా అందించిన బ్రోమోడయోలిన్ మందును నూనెతో కలిపిన నూకలను తీసుకొని విషపు ఎరను తయారు చేసుకోవాలని చెప్పారు.
News November 12, 2025
చంచల్గూడ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ

HYDలోని చంచల్గూడ జైలులో జాబ్రి, దస్తగిరి అనే రౌడీషీటర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో ఇద్దరికీ గాయాలవ్వగా జాబ్రీని సికింద్రాబాద్ గాంధీకి, దస్తగిరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఓ కేసులో రిమాండ్ ఖైదీగా వచ్చిన జాబ్రిను చూడగానే దస్తగిరి దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. వీరి గొడవతో ములాఖత్ రూమ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. వారిద్దరి మధ్య పాత గొడవలు ఉన్నట్లు సమాచారం.
News November 12, 2025
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు: డీఎంహెచ్వో

లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో అమృతం హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చాంబర్లో బుధవారం వైద్యాధికారుల కమిటీ సమావేశం జరిగింది. డెకాయ్ ఆపరేషన్లు పటిష్టంగా అమలుపరిచి, స్త్రీ నిష్పత్తిని పెంచేందుకు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాలోని 115 స్కానింగ్ సెంటర్లలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని సూచించారు.


