News March 4, 2025

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ADB అదనపు కలెక్టర్

image

యాసంగిలో పంటలకు సాగునీటిలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ సచివాలయం నుంచి పలు అంశాలపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలదేవ పాల్గొన్నారు. జిల్లాలో సాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎస్ సూచించారు.

Similar News

News March 4, 2025

ఆదిలాబాద్ జిల్లాలో నేటి TOP News

image

*నేరడిగొండలో పేద యువతి పెళ్లికి ఆర్థిక సాయం చేసిన ఆడపడుచులు
*పుట్టపర్తిలో ఆదిలాబాద్ జిల్లా భక్తుల పర్తి యాత్ర
*సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభించకపోతే ఆందోళన చేస్తాం: జోగు రామన్న
*ఉన్నతాధికారుల జోక్యంతో ప్రారంభమైన పత్తికొనుగోళ్లు
*జిల్లాలో 38 డిగ్రీల ఎండ
*పోలీసు క్రీడాకారులను సత్కరించిన ఎస్పీ
*టీచర్ MLC ఎన్నికల్లో మల్క కొమురయ్య గెలుపు

News March 3, 2025

ADB: మల్క కొమురయ్య నేపథ్యం ఇదే..!

image

KNR-ADB-NZB-MDK ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన మల్క కొమురయ్య 1959 OCT 1న పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో జన్మించారు. ఆయన OUలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 1983లో శాలివాహన గ్రూప్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఎడ్యుకేషన్ సొసైటీ ఛైర్మన్‌గా ఉన్నారు. గత MPఎన్నికల్లో ఆయన BJP తరఫున మల్కాజిగిరి టికెట్ ఆశించారు. కాగా TPUS అభ్యర్థిగా MLCకి పోటీ చేసిన ఆయనకు BJPమద్దతిచ్చింది.

News March 3, 2025

గుడిహత్నూర్: పురుగు మందు తాగి బాలిక సూసైడ్

image

గుడిహత్నూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సూర్యగూడ గ్రామానికి చెందిన గెడం వేదిక(16) సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబీకులు వెంటనే 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందినట్లు వెల్లడించారు.

error: Content is protected !!