News March 8, 2025

వీణవంక: బస్సులోనే గుండెపోటుతో మృతి

image

జమ్మికుంట-కరీంనగర్ వెళ్తున్న బస్సులో విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వీణవంక మండలం రెడ్డిపల్లికి చెందిన ఓదెలు అనే వ్యక్తి బస్సెక్కి కరీంనగర్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో బస్సులోనే గుండెపోటుతో మృతి చెందారు. కరీంనగర్ చేరుకున్న అనంతరం బస్సు కండక్టర్ ఆ వ్యక్తి మృతి చెందినట్టు గుర్తించారు. మృతుడు కరీంనగర్ ICICI బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు.

Similar News

News November 4, 2025

పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్ శ్రీజ

image

రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ సూచించారు. విద్యార్థుల హాజరు శాతంపై దృష్టి సారించాలని, వెనుకబడిన వారికి అదనపు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. హాజరు శాతం 90కి పైగా ఉండేలా తల్లిదండ్రులతో నిరంతరం ఫాలోఅప్ చేయాలని ఆదేశించారు.

News November 4, 2025

దెందులూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

దెందులూరు మండలం సత్యనారాయణపురం 16 నంబర్ జాతీయ రహదారిపై వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని ఎస్ఐ శివాజీ మంగళవారం తెలిపారు. ఏలూరు గుండుగొలను మార్గంలో సత్యనారాయణపురం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుని వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసినవారు దెందులూరు పోలీసులకు తెలియజేయాలన్నారు.

News November 4, 2025

మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై కలెక్టర్ సమీక్ష

image

జీఎస్‌ఐ ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పనను సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై మంగళవారం కలెక్టరేట్‌లో అవగాహన కార్యక్రమం జరిగింది. సంబంధిత శాఖల అధికారులు ఖచ్చితమైన వివరాలను సమయానికి అందించాలని కలెక్టర్ ఆదేశించారు.