News November 2, 2024
వీరఘట్టం: ట్రైన్ కిందపడి యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమైందని యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్ చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. వీరఘట్టం మండలం తూడి గ్రామానికి చెందిన కొనిసి శివకుమార్ (27) పార్వతీపురం కేంద్రంలోని శనివారం టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూసైడ్కు ప్రేమ వ్యవహరమే కారణమని గ్రామస్థులు అంటున్నారు.
Similar News
News December 28, 2025
శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీలు పెరగనున్నాయా?

శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల్లో ప్రస్తుతం 912 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన, పాలనా సౌలభ్యంకోసం ప్రజలనుంచి వినతలు వచ్చాయి. ఈ మేరకు 52 కొత్త పంచాయితీల ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధం చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి భారతి, సౌజన్య చెప్పారు. జిల్లా కలెక్టర్ అనుమతుల తర్వాత పంచాయతీ విభజన సాధ్యమవుతుందన్నారు.
News December 28, 2025
SKLM: ‘విధుల్లో మరింత ప్రగతి సాధించాలి’

పోలీస్ అధికారులు విధుల్లో మరింత ప్రగతి సాధించాలని జిల్లా ఎస్పీ మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో ముఖ్యమైన కేసులు, ప్రాపర్టీ నేరాల చేదన, ముద్దాయిల అరెస్టు, నిందితులకు శిక్షలుపడే విధంగా చేసిన కృషి, లోక్ అదాలత్ కేసులు పరిష్కారం వంటి అంశాల్లో చాకచక్యంగా వ్యవహరించి ప్రతిభ కనబరిచిన అధికారులనకు సర్టిఫికెట్లు ఇచ్చి అభినందించారు.
News December 28, 2025
శ్రీకాకుళం జిల్లాలో మాంసం ధరలు ఇలా.!

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. చికెన్ లైవ్ రూ.165 కాగా, స్కిన్ చికెన్ రూ.285, స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.305గా ప్రాంతాన్ని బట్టి నమోదైంది. దీంతో ఆదివారం మాంసాహార ప్రియులకు నిరాశ ఎదురైంది. వారం రోజుల వ్యవధిలో చికెన్ ధరలు సుమారు రూ.40 పెరగడంతో చర్చనీయాంశంగా మారింది. మరి మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


