News March 1, 2025
వీరఘట్టం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

వీరఘట్టం తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొట్టుగుమ్మడ గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి మృతి చెందాడు. ట్రాక్టర్పై వెళ్తున్న శివ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఎస్సై జి. కళాధర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
Similar News
News December 19, 2025
రావికమతం: సీఎం ప్రారంభించనున్న స్వచ్ఛ రథాలు ఇవే..

జిల్లాలో 3 మండలాలలో స్క్రాప్ వస్తువుల సేకరణకు స్వచ్ఛ రధాలు రావికమతంలో తయారవుతున్నాయి. ఈ నెల 20న తాళ్లపాలెంలో స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ముఖ్యమంత్రి వీటిని ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వంలో రేషన్ పంపిణీకి ఇచ్చిన వాహనాలను స్వచ్ఛ రథాలు మార్పు చేశారు. అనకాపల్లి, అచ్చుతాపురం, రావికమతం మండలాలో ఈ రధాలు ఊరురా తిరిగి స్క్రాప్ వస్తువులు ఖరీదు కట్టి నగదు, కిరాణా సరుకులు ఇస్తారు.
News December 19, 2025
NZB: ప్రజల సహకారంతోనే జీపీ ఎన్నికలు ప్రశాంతం: సీపీ

ప్రజలు, పోలీసు అధికారుల మధ్య సమన్వయంతోనే GP ఎన్నికలు నజావుగా నిర్వహించామని సీపీ సాయిచైతన్య తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్డు వెలువడిన నాటి నుంచి Dec 17 వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కృషి చేసిన అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. శాంతి భద్రతల కోసం కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకు ఎనలేని కృషి చేశారన్నారు.
News December 19, 2025
కెరమెరి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

కెరమెరి మండలం అంబారావుగూడ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ధనోర నుంచి ఆసిఫాబాద్ వైపు బైక్ పై వెళ్తుండగా ముందు వెళ్తున్న ట్రాక్టర్ను అతివేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


