News December 23, 2025
వీరఘట్టం: విద్యుత్ స్తంభాలను ఢీ కొన్న బైక్.. ఇద్దరికి తీవ్ర గాయాలు

వీరఘట్టం మండలం కడకెల్ల వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల తెలిపిన సమాచారం మేరకు.. ఖడ్గవలస నుంచి బులెట్ బైక్పై వీరఘట్టంకు చెందిన బంగారం వ్యాపారి కోణార్క్ శ్రీను మరో వ్యక్తితో కలిసి వస్తుంగా కడకెల్ల వద్ద రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని వైద్యం కోసం పార్వతీపురం తరలించారు.
Similar News
News December 24, 2025
2028లోనే ప్రజలు కాంగ్రెస్ను బొంద పెడుతారు: KTR

TG: పనికిమాలిన <<18660605>>శపథాలు<<>> చేయడం, పత్తాలేకుండా పారిపోవడం రేవంత్కు అలవాటని BRS నేత కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘తిట్లు, బూతులతో డైవర్షన్ డ్రామాలు, తమాషాలు ప్రతిసారి పనిచేయవు. 2028లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం. మళ్లీ వందేండ్ల దాకా పుట్టగతులు లేకుండా పాతిపెట్టడం తథ్యం. మేము ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలం కాదు. రైతన్న హక్కులకు భంగం కలిగితే భగ్గున మండుతాం’ అని Xలో ఫైరయ్యారు.
News December 24, 2025
KMR: సైబర్ బాధితులకు రూ.1.07 కోట్లు వాపస్!

కామారెడ్డి జిల్లాలో గతేడాది జిల్లాలో 200 సైబర్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 160కి తగ్గింది. ముఖ్యంగా, సైబర్ మోసాలకు గురైన బాధితులకు లోక్ అదాలత్, కోర్టు ఉత్తర్వుల ద్వారా రూ.1,07,31,518 విలువైన సొత్తును తిరిగి ఇప్పించడం విశేషం. 2024లో 35 NDPS కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 23కి తగ్గింది. నిరంతర నిఘా, కఠిన తనిఖీలు చేపట్టడం ద్వారా జిల్లాలో గంజాయి సరఫరాను అడ్డుకోగలిగారు.
News December 24, 2025
కామారెడ్డి జిల్లాలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు..

కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన పటిష్టమైన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నిబంధనల అమలు వల్ల ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. 2024లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 262 మంది మృతి చెందగా, 263 మంది గాయపడ్డారు. 2025లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 200 మంది మృతి చెందగా, 242 మంది గాయపడ్డారు. గతేడాదితో పోలిస్తే మరణాల సంఖ్యలోనూ, సాధారణ ప్రమాదాల సంఖ్యలోనూ పెద్ద ఎత్తున తగ్గుదల కనిపించడం గమనార్హం.


