News March 7, 2025

వీరఘట్టం: హార్ట్ ఎటాక్‌తో మహిళ మృతి

image

వీరఘట్టం మేజరుపంచాయతీలోని ముచ్చర్లవీధికి చెందిన డాకూ సునీత (47 ) అనే మహిళ శుక్రవారం తెల్లవారుజామున హార్ట్ ఎటాక్‌తో మృతి చెందారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో సునీతకు గుండెనొప్పి రావడంతో వీరఘట్టం పీ.హెచ్.సీకి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. తర్వాత పార్వతీపురం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News

News November 4, 2025

మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌లో వర్షం

image

రానున్న 2-3 గంటల్లో నగరంలో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముండగా, ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీలోపు ఉండే అవకాశం ఉందని సూచించింది. ప్రజలు వర్షం సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

News November 4, 2025

కూటమి ప్రభుత్వం రైతుల వెన్ను విరిచింది: జగన్

image

కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలైనా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. రూ. 40 వేల పెట్టుబడి సాయం ఇవ్వాల్సింది పోయి, కేవలం రూ.5 వేలు ఇచ్చి రైతు వెన్ను విరిచారు అని వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో ఉచిత ఇన్సూరెన్స్ ఉండేదని, ఇప్పుడు ఎరువులు కూడా బ్లాక్‌లో కొనే పరిస్థితి వచ్చిందని, రైతుల పరిస్థితి దారుణంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

News November 4, 2025

తిరుపతి: విధుల నుంచి ఇద్దరు టీచర్లు తొలగింపు

image

తిరుపతి జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులు 3 సంవత్సరాలుగా సమాచారం లేకుండా ఉద్యోగానికి రావడం లేదు. శ్రీకాళహస్తి మండలం ఓబులేలపల్లి ZP హైస్కూల్ వ్యాయమ ఉపాధ్యాయుడు ఏ.బాలకృష్ణ. రేణిగుంట మండలం గుండ్లకలువ MPPS SGT టీచర్ పి.దేవరాజును ఉద్యోగం నుంచి తొలగిస్తూ డీఈవో కుమార్ ఆదేశాలు జారీ చేశారు.