News January 29, 2025

వీరభద్రస్వామి జాతర ఆదాయం రూ.1,10,36,563 

image

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం జాతర హుండీ ఆదాయం లెక్కించారు. సంక్రాంతి సందర్భంగా జరిగిన జాతర బ్రహ్మోత్సవాలలో టెండర్ల ద్వారా రూ.43,38,000, హుండీ రూ. 36,27,222, మొత్తం జాతర ఆదాయం రూ.1,10,36,563 సమకూరినట్లు ఈవో కిషన్ రావు తెలిపారు.మిశ్రమ బంగారం 8 గ్రా. వెండి 1.9 కిలోలు కానుకలు వచ్చాయన్నారు. గత జాతర కంటే రూ.16 లక్షల ఆదాయం అదనంగా వచ్చిందని చెప్పారు.

Similar News

News January 7, 2026

LIC జీవన్ ఉత్సవ్.. బెనిఫిట్స్ ఇవే

image

LIC కొత్తగా జీవన్ ఉత్సవ్ పాలసీని ఆవిష్కరించింది. ఇందులో జీవితాంతం ఆదాయం, బీమా రక్షణ లభిస్తుందని తెలిపింది. JAN 12 నుంచి స్కీమ్ అందుబాటులో ఉంటుంది. నెల వయసు పిల్లల నుంచి 65ఏళ్ల వరకు ఈ పాలసీకి అర్హులు. కనీస బీమా మొత్తం ₹5L. గరిష్ఠ పరిమితి లేదు. ప్రతి ₹వెయ్యికి ఏటా₹40 చొప్పున జమ అవుతుంది. 7-17ఏళ్ల తర్వాత ప్రైమరీ బీమా మొత్తంలో 10% ఆదాయం లభిస్తుంది. దీన్ని LIC వద్దే ఉంచితే 5.5% చక్రవడ్డీ చెల్లిస్తుంది.

News January 7, 2026

నిర్మల్: యాక్సిడెంట్.. యువకుడి మృతి

image

అంత్యక్రియలకు వచ్చి వెళ్తుండగా యువకుడు మృతి చెందిన ఘటన దిలావర్పూర్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. నర్సపూర్‌(జి)కి చెందిన నితిన్(21) HYDలో ఉద్యోగం చేస్తున్నాడు. స్వగ్రామంలో బంధువు చనిపోవడంతో అంత్యక్రియలకు వచ్చాడు. తిరిగి వెళ్లేందుకు బైక్‌పై నిర్మల్ బయలుదేరాడు. రహదారిపై అటవీ జంతువు అడ్డురావడంతో తప్పించబోయి కిందపడ్డాడు. నిఖిల్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

News January 7, 2026

WGL: కుక్కలు అడ్డు వచ్చి ఇద్దరు మృతి

image

జిల్లాలోని గీసుగొండలో కుక్కల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఒకే మండలానికి చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. ఎలుకుర్తి హవేలీకి చెందిన ఆడెపు శివ ఇటీవల మచ్చపూర్ వద్ద కుక్క అడ్డు రావడంతో జరిగిన ప్రమాదంలో మృతి చెందగా, ఆ విషాదం మరువక ముందే గంగదేవిపల్లికి చెందిన గూడ సంతోశ్ కుమార్ ధర్మారం వద్ద నిన్న కుక్క కారణంగా ప్రాణాలు విడిచారు.