News August 28, 2024

వీర్నపల్లి: అనారోగ్యంతో ఓ మహిళ మృతి

image

వీర్నపల్లి మండలానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం అంకమళ్ళ రేఖ (35) అనే మహిళ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. భర్త సుదర్శన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ మృతి చెందాడు. అప్పటినుంచి రేఖ తల్లి గారైన రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో ఉంటుంది. మంగళవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. తల్లిదండ్రులు చనిపోవడంతో కూతురు అనాథగా మిగిలిపోయింది.

Similar News

News February 13, 2026

జమ్మికుంటలో దిగ్గజాలు కనుమరుగు.. కొత్త వారికి పట్టం!

image

జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటర్లు వినూత్న తీర్పు ఇచ్చారు. రాజకీయ అనుభవం ఉన్న హేమాహేమీలను పక్కనపెట్టి, ఉత్సాహవంతులైన కొత్త అభ్యర్థులను గెలిపించారు. ముఖ్యంగా గతంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ వంటి కీలక పదవుల్లో పనిచేసి, పట్టణంపై పట్టున్న నాయకులు సైతం ఈ ఎన్నికల్లో ఓటమి పాలుకావడం గమనార్హం.

News February 13, 2026

జమ్మికుంట మున్సిపల్ కుర్చీకి తప్పని ‘ఎక్స్-అఫీషియో’ సెగ!

image

జమ్మికుంట మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడటంతో స్వతంత్రులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఎక్స్-అఫీషియో ఓట్ల వినియోగం, స్వతంత్రుల మద్దతుపైనే జమ్మికుంట మున్సిపల్ పీఠం భవితవ్యం ఆధారపడి ఉంది. రేపటిలోపు రాజకీయ సమీకరణాలు ఏ మలుపు తిరుగుతాయోనని పట్టణ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

News February 13, 2026

నలుగురి చేతిలో జమ్మికుంట భవితవ్యం..!

image

జమ్మికుంట మున్సిపాలిటీలో హంగు ఏర్పడడంతో BRS, కాంగ్రెస్ పార్టీలు స్వతంత్రులను తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా AIFB అభ్యర్థితో పాటు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులకు రెండు పార్టీల నుంచి భారీ ఆఫర్లు అందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకరిద్దరు అభ్యర్థులు మద్దతు ఇచ్చినా సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉండటంతో జమ్మికుంట రాజకీయం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.