News March 28, 2025

వెంకటగిరిలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

తిరుపతి జిల్లా వెంకటగిరిలో శుక్రవారం ఒక్కసారిగా ఉష్ణోగ్రత 42.2°C డిగ్రీలు నమోదయిందని అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాధారణ ఉష్ణోగ్రత ఉండగా మధ్యాహ్నం ఒక్కసారి ఉష్ణోగ్రతలు పెరిగాయి. వృద్ధులు, చిన్నారులు ఎండ వేడిమి తాళలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజు రోజుకి ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎండ నుంచి రక్షణ పొందేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News February 22, 2026

ముంబై పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>ముంబై<<>> పోర్ట్ అథారిటీ 4 హిందీ ట్రాన్స్‌లేటర్ గ్రూప్ -2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ(హిందీ, ఇంగ్లీష్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.48,000+HRA చెల్లిస్తారు. రాత పరీక్ష, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mumbaiport.gov.in

News February 22, 2026

T20WC: శ్రీలంకపై ఇంగ్లండ్ స్కోర్ ఎంతంటే?

image

పల్లెకెలె: భారీ హిట్టర్లున్న ఇంగ్లండ్ జట్టును శ్రీలంక తక్కువ పరుగులకే కట్టడి చేసింది. కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 రన్స్ చేసింది. ఓపెనర్ సాల్ట్ 62 పరుగులతో రాణించారు. చివర్లో విల్ జాక్స్(21) వేగంగా రన్స్ రాబట్టారు. వెల్లలాగే 3 వికెట్లతో సత్తా చాటారు. శ్రీలంక విజయ లక్ష్యం 147 పరుగులు.

News February 22, 2026

రైతోత్సవం మేళా 2026ను ప్రారంభించిన: ఎంపీ

image

జిల్లాలో సేంద్రీయ‌ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా విస్తృత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు MP కేశినేని శివ‌నాథ్ ప్రకటించారు.
ఆర్గానిక్ రైతోత్సవం, నేచురల్ ఫార్మింగ్ మేళా-2026ను ఆయన విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం ప్రారంభించారు. జిల్లాలోని 16 మండలాల వారీగా 3 రోజుల సమగ్ర శిక్షణా శిబిరాలు నిర్వహించి రైతులను ఆర్గానిక్ వ్యవసాయం వైపు మళ్లించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు.