News August 9, 2024

వెంకటగిరి: చనిపోయిన భార్య శిలా విగ్రహాన్ని చేయించి పూజించిన భర్త

image

చనిపోయిన భార్యపై ప్రేమను భర్త వినూత్నంగా చాటుకున్నారు. వెంకటగిరికి చెందిన భక్తకవి పెనగలూరి కుమార్ భార్య భూషణమ్మ గతేడాది మరణించారు. దీంతో భార్య జ్ఞాపకార్థం ఆమె సంవత్సరికం సందర్భంగా శిలా విగ్రహాన్ని తన స్వగృహంలో ప్రతిష్ఠించి పూజలు చేశారు. భార్యపై తనకున్న ప్రేమ అమూల్యమైనదని చాటి చెప్పారు.

Similar News

News November 13, 2025

వారికి రూ.90 కోట్ల మంజూరు: అబ్దుల్ అజీజ్

image

నెల్లూరు: ఇమామ్, మౌజన్‌ల గౌరవ వేతనాల కోసం రూ.90 కోట్లు మంజూరు చేసినట్లు ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించిందన్నారు. చంద్రబాబు దూరదృష్టి, సమానత్వ నిబద్ధతతోనే ముస్లింల అభివృద్ధి జరుగుతుందన్నారు.

News November 12, 2025

రేపే నెల్లూరుకు ఫుడ్ కమిషన్ సభ్యుడి రాక

image

రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి.కాంతారావు నెల్లూరు జిల్లాలో ఈనెల 13, 14న పర్యటించనున్నారు. ఈ మేరకు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పీడీఎస్‌ షాప్స్, ఐసీడీఎస్‌, మధ్యాహ్న భోజన పథకం అమలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలను తనిఖీ చేస్తారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖపై సమీక్ష చేస్తారు.

News November 12, 2025

నెల్లూరు: ఆక్వా రైతులకు గమనిక

image

ఆక్వా రైతులందరికీ విద్యుత్తు బిల్లుల్లో రాయితీ ఇస్తామని నెల్లూరు RDO అనూష ప్రకటించారు. రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ధి అథారిటీ చట్టం-2020 ద్వారా అనుమతులు పొందిన వాళ్లే అర్హులన్నారు. రొయ్యలు, చేపల చెరువుల రైతులు సచివాలయంలో రూ.1000 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డు, పాస్ బుక్, ఆటో క్యాడ్ మ్యాప్, ప్రాజెక్ట్ రిపోర్ట్, మీటర్ నంబర్, వాల్టా చట్టం అఫిడవిట్ పేపర్లు అవసరమని చెప్పారు.