News March 13, 2025
వెంకటాపూర్: Way2Newsకు స్పందన

“రామప్ప ప్రధాన కాలువకు బుంగ ” శీర్షికన ఈనెల 10న <<15710154 >>Way2Newsలో ప్రచురితమైన<<>> కథనానికి ములుగు జిల్లా నీటిపారుల శాఖ అధికారులు స్పందించారు. వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ప్రధాన కాలువ ఐన ఒగరు కాలువ గండిని బుధవారం పూడ్చివేశారు. అనంతరం ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. దీంతో ఆయకట్టు రైతులు Way2Newsకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News December 20, 2025
T20ల్లో తిరుగులేని జట్టుగా టీమ్ఇండియా!

టీ20 సిరీసుల్లో భారత్ జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. తాజాగా SAపై సిరీస్ గెలుపుతో IND వరుసగా 8వ ద్వైపాక్షిక T20 సిరీస్ను సొంతం చేసుకుంది. 2023 డిసెంబర్ నుంచి ఇది కొనసాగుతోంది. మొత్తంగా భారత్ వరుసగా 14 సిరీస్లు(ద్వైపాక్షిక+ టోర్నమెంట్లు) గెలిచింది. ఇందులో 2023 ఏషియన్ గేమ్స్, 2024 T20 వరల్డ్ కప్, 2025 ఆసియా కప్ కూడా ఉన్నాయి. టీమ్ఇండియా చివరిసారి 2023 ఆగస్టులో WIపై 3-2 తేడాతో సిరీస్ కోల్పోయింది.
News December 20, 2025
ASF: బీటీ రోడ్డు కోసం హైదరాబాద్కు పాదయాత్ర

దశాబ్దాలుగా రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారని లింగాపూర్ మండలం పులసింగ్ గ్రామానికి చెందిన జై చాంద్ ఆవేదన వ్యక్తం చేశారు. లింగాపూర్–పంగిడి మదొర వరకు మంజూరైన బీటీ రోడ్డు పనులు టెండర్లు పూర్తైనా ప్రారంభం కాలేదన్నారు. రోడ్డు లేక అనారోగ్య సమయంలో ఆసుపత్రికి చేరలేక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయన్నారు. రోడ్డు సాధనకై రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు.
News December 20, 2025
డిసెంబర్ 20: చరిత్రలో ఈరోజు

1934: వ్యవసాయ శాస్త్రవేత్త ఈడుపుగంటి వెంకట సుబ్బారావు జననం
1940: శాస్త్రీయ నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి జననం (ఫొటోలో)
1951: కథారచయిత కన్నేపల్లి చలమయ్య జననం
1988: సినీ నటి బి.జయమ్మ మరణం
☛ అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం


