News October 5, 2024

వెంకట స్వామికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం

image

ట్యాంకు బండ్‌పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెంకట్ స్వామి జయంతి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని వెంకట స్వామి విగ్రహానికి ఎమ్మేల్యేలు వివేక్, వినోద్‌తో కలిపి నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. రాజకీయాల్లో నైతిక విలువలను, ప్రజా స్వామ్య విలువలను ఏ విధంగా పరిష్కరించరించలేని అంశాలను కూడా అవలీలగా అధిగమించిన నేత వెంకట్ స్వామి అని కొనియాడారు.

Similar News

News October 5, 2024

సంగారెడ్డి: ఇన్‌స్పైర్ మనక్‌కు దరఖాస్తు చేసుకోండి !

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలో 6 నుంచి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 15లోగా ఇన్‌స్పైర్ మనక్‌కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. జిల్లా నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఇన్‌స్పైర్ మనక్‌కు దరఖాస్తు చేసుకునేలా ఉపాద్యాయులు కృషి చేయాలని కోరారు.

News October 5, 2024

రాజగోపురంలో అన్నపూర్ణ దేవిగా ఏడుపాయల వన దుర్గమ్మ దర్శనం

image

దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా మూడోరోజు శనివారం ఏడుపాయల వన దుర్గాభవాని మాతను నీలం రంగు వస్త్రాలతో శ్రీ అన్నపూర్ణ దేవి (చంద్రఘంటాదేవి)రూపంలో అలంకరించారు. వేకువజాము నుంచి వేద బ్రాహ్మణులు రావికోటి-శంకర్ శర్మ ఆధ్వర్యంలో రాజ గోపురంలో శ్రీ వన దుర్గభవాని అమ్మవారికి మంజీరా జలాలతో ప్రత్యేక అభిషేకం, సహస్ర నామార్చన, కుంకుమార్చన పూజలు నిర్వహించి నీలం రంగు వస్త్రాలతో అన్నపూర్ణ దేవిగా అలంకరించి మంగళహారతి ఇచ్చారు.

News October 5, 2024

సంగారెడ్డి: పండుగ దృష్ట్యా 542 ప్రత్యేక బస్సులు

image

దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి మెదక్ రీజియన్ పరిధిలో 542 ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు సమాయత్తమైంది. సంగారెడ్డి రీజియన్ పరిధిలోని 8 డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు సంగారెడ్డి ఆర్ఎం ప్రభులత తెలిపారు.ఆర్టీసీ చెందిన 334 సర్వీసులు, హైర్ బస్సులు 208 నడుపుతున్నామన్నారు. రద్దీ ఉంటే మరిన్ని నడుపుతామన్నారు.