News December 26, 2025
వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.. వాడపల్లికి 4 వరుసల రోడ్డు!

వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే రహదారిని 4వరుసలుగా విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణపై సుదీర్ఘంగా చర్చించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఈ ఆధునిక రహదారిని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 28, 2025
ఉజ్జయిని ఆలయానికి రూ.100 కోట్ల విరాళాలు

MPలోని ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయానికి ఈ ఏడాది ₹107.93 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయి. ఇందులో ₹13 కోట్ల విలువైన బంగారం ఉండటం గమనార్హం. ఈ ఏడాది డిసెంబర్ 15 వరకు 5.5 కోట్ల మంది ఆలయాన్ని దర్శించుకున్నారు. సగటున రోజూ 1.5L-2L మంది వస్తున్నారు. సెలవుల్లో రద్దీ ఎక్కువగా ఉంటోందని, క్రిస్మస్ రోజున 2.5 లక్షల మంది దర్శనానికి వచ్చారని ఆలయ కమిటీ తెలిపింది. న్యూఇయర్ దాకా మరో 6 లక్షల మంది వస్తారని చెప్పింది.
News December 28, 2025
ఉజ్జయిని ఆలయానికి రూ.100 కోట్ల విరాళాలు

MPలోని ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయానికి ఈ ఏడాది ₹107.93 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయి. ఇందులో ₹13 కోట్ల విలువైన బంగారం ఉండటం గమనార్హం. ఈ ఏడాది డిసెంబర్ 15 వరకు 5.5 కోట్ల మంది ఆలయాన్ని దర్శించుకున్నారు. సగటున రోజూ 1.5L-2L మంది వస్తున్నారు. సెలవుల్లో రద్దీ ఎక్కువగా ఉంటోందని, క్రిస్మస్ రోజున 2.5 లక్షల మంది దర్శనానికి వచ్చారని ఆలయ కమిటీ తెలిపింది. న్యూఇయర్ దాకా మరో 6 లక్షల మంది వస్తారని చెప్పింది.
News December 28, 2025
ఈనెల 29న సంగారెడ్డిలో ‘జాబ్ మేళా’

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 29న సంగారెడ్డి బైపాస్ రోడ్డులోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్డీవో జ్యోతి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై, 18 నుంచి 30 ఏళ్ల వయసున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.


