News February 18, 2025

వెనుకబడిన విద్యార్థులపై దృష్టిపెట్టండి: CMO

image

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని SSA జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి సుబ్రహ్మణ్యం సూచించారు. పి.గన్నవరం మండలం మానేపల్లి బాలుర, బాలికల ZPH స్కూల్స్‌ను ఆయన సోమవారం సందర్శించారు. 10వ తరగతి ప్రిపబ్లిక్, భౌతిక శాస్త్రం పరీక్ష నిర్వహణ తీరు పరిశీలించారు. పబ్లిక్ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధతపై పలు సూచనలు చేశారు. ఏడు రివిజన్ టెస్టుల్లో సాధించిన ప్రగతిని పరిశీలించారు.

Similar News

News November 8, 2025

APSRTCలో 277 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

APSRTC‌లో 277 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. కర్నూలు(46), నంద్యాల(43), అనంతపురం(50), శ్రీ సత్యసాయి(34), కడప(60), అన్నమయ్య(44) జిల్లాలో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ITI అర్హతగల అభ్యర్థులు www.apprenticeshipindia.gov.inలో నమోదు చేసుకున్న తర్వాత వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులను విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: apsrtc.ap.gov.in/

News November 8, 2025

గంభీరావుపేట: పంట పొలాల్లో రైతు మృతి

image

వరి పంట పొలంలో రైతు హఠాత్తుగా మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మండలంలోని గజ సింగవరం గ్రామానికి చెందిన ధ్యాన బోయిన విజ్ఞయ్య శుక్రవారం వరి పొలం కోయడానికి వెళ్లగా హఠాత్తుగా కిందపడి మృతి చెందాడు. తనకున్న ఎకరంలో వరి పంట సాగు చేశాడు. అకాల వర్షాలకు పంట దెబ్బతినడంతో.. పంట చేతికస్తుందో లేదో అని ఆందోళనతో కుప్పకూలి హఠాన్మరణం చెందాడు.

News November 8, 2025

కృష్ణా: శబరిమలై స్పెషల్ ట్రైన్స్ నడిచే తేదిలివే.!

image

శబరిమలై వెళ్లేవారికై ఉమ్మడి జిల్లా మీదుగా మచిలీపట్నం (MTM), కొల్లం(QLN) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ స్పెషల్ ట్రైన్స్ NOV 14-NOV 28 వరకు ప్రతి శుక్రవారం MTM-QLN(నం.07101), NOV 16 నుంచి NOV 30 వరకు ప్రతి ఆదివారం QLN-MTM(నం.07102) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. కాగా ఈ రైళ్లు ఉమ్మడి జిల్లాలో గుడివాడ, విజయవాడతో పాటు ఏపీలోని ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.