News September 13, 2025
వెల్గటూర్: రోడ్డు ప్రమాదం.. యువకులకు గాయాలు

వెల్గటూర్ మండలం కిషనరావుపేట్ గ్రామ బస్టాప్కు సమీపంలో రాష్ట్ర రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి కింద పడిన ఘటనలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వెల్గటూర్ నుంచి ధర్మారం వైపు వెళ్తున్న పల్సర్ బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. గాయపడిన వారిని హుటాహుటిన అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు.
Similar News
News April 15, 2026
కాకినాడ: 300 ఏళ్ల చరిత్ర.. అగ్గిపెట్టెలో పట్టే చీర!

ఉప్పాడ పట్టు చీరల్లో వాడే ‘జామ్దానీ’ పద్ధతి మూలాలు బంగ్లాదేశ్లో ఉన్నాయని చాలా మందికి తెలియదు. 18వ శతాబ్దంలో ఈ పద్ధతిని దక్షిణ భారతదేశానికి తీసుకురాగా, ఉప్పాడ నేతన్నలు దానిని మరింత ఆధునీకరించి ఒక విశిష్ఠ శైలిని రూపొందించారు. 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కళను ఉప్పాడ నేతన్నలు అద్భుతంగా మలచుకున్నారు. అత్యంత తేలికగా ఉండే ఈ చీరలను ఒక చిన్న అగ్గిపెట్టెలో పట్టేంత నైపుణ్యంతో నేయడం వీరి ప్రత్యేకత.
News April 15, 2026
ఫిర్యాదుల పరిష్కారంలో ప.గో జిల్లాకు మూడో స్థానం

పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలను పరిష్కరించడంలో పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సమర్థంగా విధులు నిర్వహించిన సిబ్బందిని అభినందించారు. ఇదే ఉత్సాహంతో ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించాలన్నారు.
News April 15, 2026
ఫిర్యాదుల పరిష్కారంలో ప.గో జిల్లాకు మూడో స్థానం

పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలను పరిష్కరించడంలో పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సమర్థంగా విధులు నిర్వహించిన సిబ్బందిని అభినందించారు. ఇదే ఉత్సాహంతో ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించాలన్నారు.


