News May 27, 2024

వెల్డింగ్ పని చేస్తూ విద్యుత్ షాక్‌‌తో వ్యక్తి మృతి

image

వెల్డింగ్ పని చేస్తూ విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతిచెందిన ఘటన కనేకల్లు మండలంలోని ఆదిగానిపల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బడిగే శ్రీనివాసులు (55) సోమవారం మధ్యాహ్నం వ్యవసాయం పనిముట్లు వెల్డింగ్ పనిచేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.

Similar News

News November 8, 2025

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడిపత్రి యువకులు

image

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడిపత్రి క్రీడాకారులు ఎంపికయ్యారు. గుంతకల్లు మండలం కొనకొందల జరిగిన బాలబాలికల 35వ సబ్ జూనియర్ క్రీడా పోటీలలో తాడిపత్రి కబడ్డీ క్రీడాకారులు ఉభయ్ చంద్ర, హర్షవర్ధన్, మనోజ్ కుమార్ ప్రతిభ కనబరిచి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. కడప జిల్లా పులివెందులలో జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో వీరు పాల్గొంటారని కోచ్ శివ పేర్కొన్నారు.

News November 6, 2025

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడిపత్రి అమ్మాయిలు

image

అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలలో తాడిపత్రి అమ్మాయిలు సత్తా చాటారు. SGFI ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో అండర్-17 విభాగంలో అర్షియ, అవనిక, చాందిని.. అండర్-14 విభాగంలో ఆయేషా జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు కబడ్డీ కోచ్ లక్ష్మీ నరసింహ తెలిపారు.

News November 5, 2025

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించి, విస్తరించాలని కలెక్టర్ ఆనంద్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న గ్రామపంచాయతీ స్థాయి వరకు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలకు మార్కెట్‌లో డిమాండ్ ఉంటుందని అన్నారు.