News April 3, 2024

వెల్దుర్తి: తోటలో పనికి వచ్చిన వ్యక్తి సూసైడ్

image

వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధి శెట్టిపల్లి కలాన్ శివారులో కొబ్బరి తోటలో పనిచేసేందుకు వచ్చిన వెంకటరమణ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఏపీలోని వడ్లమూరుకు చెందిన వెంకటరమణ, భాగ్యలక్ష్మి దంపతులు 3 నెలల క్రితం తోటలో పని చేసేందుకు వచ్చారు. రాత్రి మద్యం సేవించి రాగా భార్య గొడవ చేయడంతో బయటకు వెళ్లి విషం తాగాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేశారు.

Similar News

News February 14, 2026

మెదక్: రేపు 11లోపు Form-A సమర్పించాలి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ అధికార ప్రతినిధిత్వానికి సంబంధించి Form-Aని రేపు ఉ.11 గంటలలోగా సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. అలాగే Form-Bని ఎన్నిక రోజు ఉ.10 గంటల వరకు అందజేయాలని సూచించారు. గడువులోపు మార్పులకు అవకాశం ఉంటుందని, ఎన్నికల సమావేశం చెల్లుబాటు కావాలంటే కనీసం 50 శాతం సభ్యుల హాజరు తప్పనిసరని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన కోరారు.

News February 14, 2026

మెదక్: ఏడుపాయల జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు

image

మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు జరిగే ఏడుపాయల వనదుర్గ మాత జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాతర ప్రాంగణాన్ని సిసి కెమెరాల నిఘాలో ఉంచామన్నారు. భద్రత కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భక్తులు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

News February 14, 2026

రామాయంపేటలో అధికార పార్టీకే పట్టం

image

రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మరోసారి అధికార పార్టీకి జై కొట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తొలి ఎన్నికల్లో 8 స్థానాలను ఆ పార్టీకి అందించిన ఓటర్లు, నేడు జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే రీతిన కాంగ్రెస్ పార్టీకి 8 కౌన్సిలర్ స్థానాలను కట్టబెట్టారు. అధికార పార్టీతోనే పట్టణాభివృద్ధి సాధ్యమని ఆకాంక్షిస్తూ ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.