News February 26, 2025

వేంపాడులో లారీ ఢీకొని కాకినాడ జిల్లా వాసి మృతి

image

నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందినట్లు ఎస్సై సన్నిబాబు మంగళవారం తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు చెందిన చిక్కాల శ్యాంప్రసాద్ (29) వేంపాడు వద్ద ఫ్యాబ్రిక్స్ వర్క్స్ షాపులో పని చేస్తున్నాడు. స్నేహితుడితో కలిసి బైక్‌పై టోల్ ప్లాజా వద్ద టీపాయింట్‌కు వెళుతుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్యాం ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు.

Similar News

News July 7, 2025

సిరిసిల్ల: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గ్రామస్థుల వివరాలు ప్రకారం.. బరిగెల అరుణ్ కుమార్ (29), సిరిసిల్ల నెహ్రు నగర్‌కు చెందిన తడక సాయి చరణ్(27) లు <<16972767>>ఆదివారం<<>> ద్విచక్ర వాహనంపై సిరిసిల్లకు వెళ్తుండగా పెద్దూరు గ్రామ శివారులో వీరి ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుణ్ కుమార్ కు తీవ్ర గాయాలై మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

News July 7, 2025

ఇవాళ, రేపు కడప జిల్లాలో జగన్ పర్యటన

image

AP: వైసీపీ అధినేత జగన్ ఇవాళ, రేపు YSR కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం పులివెందులకు చేరుకోనున్న ఆయన రాత్రికి అక్కడ బస చేస్తారు. రేపు ఉదయం 7.30 గంటలకు పులివెందుల నుంచి బయల్దేరి ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత YSR జయంతి సందర్భంగా ఘాట్‌లో ఆయనకు నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడ జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ప్రజలను కలుస్తారు.

News July 7, 2025

‘అనకాపల్లి జిల్లాలో 1.33 లక్షల మంది లబ్ధిదారులు’

image

అనకాపల్లి జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకానికి 1.33 లక్షల మంది రైతులు అర్హత సాధించినట్లు జిల్లా వ్యవసాయాధికారి మోహన్ రావు ఆదివారం తెలిపారు. వెబ్ ల్యాండ్‌లో వివరాలు సరిగా నమోదు కాని రైతులు 23 వేల మంది ఉన్నట్లు వెల్లడించారు. వీరంతా ఈనెల 10వ తేదీలోగా సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.