News March 1, 2026

వేట్లపాలెం పేలుడు ఘటన.. మరొకరి మృతి!

image

వేట్లపాలెం బాణసంచా పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరింది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సామర్లకోట కుమ్మరి వీధికి చెందిన దర్శిపాటి లోవరాజు (40) ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో బాధితుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషాద ఘటనతో బాధితుల కుటుంబాల్లో తీరని శోకం నెలకొంది. అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News March 1, 2026

అంగన్వాడీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

image

AP: రాష్ట్రవ్యాప్తంగా 5వేల మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్లుగా ప్రమోషన్లు, పూర్తి స్థాయి వేతనాలు ఇస్తామన్నారు. అమరావతిలో అంగన్వాడీ కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. కొత్తగా 5,000 మంది అంగన్వాడీ సహాయకులను నియమించనున్నట్లు వెల్లడించారు. వేతనాల పెంపు డిమాండ్‌నూ అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

News March 1, 2026

MBNR: ముగిసిన ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్ష

image

జిల్లా కేంద్రంలో NTR మహిళ డిగ్రీ కళాశాల నందు జరిగిన ఎస్సీ స్టడీ సర్కిల్ (5) నెలల శిక్షణ కోసం ప్రవేశ పరీక్ష ఆదివారం నాడు ప్రశాంతంగా ముగిసింది. ఈ ప్రవేశ పరీక్ష కు 617 మంది హాజరయ్యారు. వీరిలో మెరిట్ ఆధారంగా 100 మందికి 5 నెలల పాటు రెసిడెన్షియల్ పద్ధతిలో (GROUP1,2,3,&4, SI & PC, RRB, BANKING) ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు DD (SCDD)డి.సునీత, స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు.

News March 1, 2026

కొయ్యూరు: యాక్సిడెంట్.. రెవెన్యూ ఉద్యోగికి గాయాలు

image

కొయ్యూరు మండలంలోని చింతాలమ్మ ఘాట్ రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేంద్రపాలెం వీఆర్వో సత్యనారాయణ, ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. సత్యనారాయణ తన కుమారుడుతో కలిసి బైక్‌పై కేడీపేట వైపు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గాయపడిన ఇద్దరిని అంబులెన్సు వాహనంలో కేడీపేట పీహెచ్‌సీకి తరలించారు.