News March 1, 2026
వేట్లపాలెం ప్రమాదంపై డిప్యూటీ సీఎం, హోంమంత్రి సమీక్ష

వేట్లపాలెం బాణసంచా పేలుడుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు మురళీ మోహన్, నిరంజన్ రెడ్డి వారిని కలిసి వివరాలను వివరించారు. ప్రమాదానికి గల కారణాలు, భద్రతా లోపాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీ నేత మాధవ్ కూడా పాల్గొన్న ఈ భేటీలో బాధితులకు అండగా ఉండాలని నిర్ణయించారు.
Similar News
News March 6, 2026
అమ్మానాన్నల మార్గదర్శకత్వమే ఐఏఎస్ను చేసింది: తరుణ్

హనుమకొండ జిల్లా కేంద్రానికి చెందిన అట్ల రవీందర్ – అమరావతి దంపతుల కుమారుడు తరుణ్ తేజ సివిల్ సర్వీస్లో 123వ ర్యాంకు సాధించి ఐఏఎస్గా ఎంపికయ్యారు. 2024లో ఐఎఫ్ఎస్గా ఎంపికైన తరుణ్ తేజ తెలంగాణ క్యాడర్కి నియమించబడడం గమనార్హం. తరుణ్ తల్లిండ్రులిద్దరూ ఫిజికల్ సైన్స్ టీచర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో క్రమశిక్షణతో ఈ విజయం సాధించానని తరుణ్ తెలిపారు.
News March 6, 2026
మిషన్ మోడ్లో ‘ప్రజా పాలన’: కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్ జిల్లాలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ను మిషన్ మోడ్లో పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో 99 రోజుల కార్యాచరణపై ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 10 ప్రత్యేక అంశాలతో (థీమ్స్) ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు.
News March 6, 2026
విద్యార్థులు పెడదోవ పట్టకుండా అవగాహన కల్పించాలి: కృష్ణా కలెక్టర్

విద్యార్థులు పెడదోవ పట్టకుండా విద్యా సంస్థల్లో పెద్ద ఎత్తున అవగాహనా సదస్సులు నిర్వహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంచి, చెడుపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి తన చాంబర్లో బాలబాలికలు, యువత భద్రతపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.


