News August 27, 2024
వేదవతి నదిపై ఎత్తిపోతల

విశ్రాంత డీఈఈ సుబ్బారాయుడు వేదవతి నదిపై ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించి ఎల్లెల్సీ కాల్వకు నీటిని మళ్లిస్తే కరవు కష్టాలు తీర్చవచ్చని సీఎం చంద్రబాబు, d.cm పవన్కు లేఖ రాశారు. 4 నెలల్లో పూర్తి చేయొచ్చంటూ సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఇందుకు సుమారు రూ.200 కోట్ల వరకు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వ ఉన్నతాధికారులు త్వరలో క్షేత్రస్థాయిలో పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News February 10, 2026
మహా శివరాత్రికి శైవక్షేత్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలోని శైవక్షేత్రాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, డీఎస్పీలు, తహశీల్దార్లు, ఎండోమెంట్స్ అధికారులతో సమీక్షించారు. దేవాలయాల్లో పారిశుద్ధ్యం, క్యూలైన్లు, బ్యారికేడింగ్, తాగునీరు, షేడ్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
News February 10, 2026
పీహెచ్సీల్లో డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్

పీహెచ్సీల్లో డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ నుంచి వాట్సప్ గవర్నెన్స్పై అధికారులతో సమీక్ష ద్వారా మాట్లాడారు. వాట్సప్ గవర్నెన్స్లో ఈ నెల కూడా జిల్లా మొదటి స్థానంలో ఉండాలని అన్నారు. నాలుగు రోజుల్లోపు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
News February 10, 2026
డ్రోన్ పెట్రోలింగ్తో కర్నూలు పోలీసుల స్మార్ట్ నిఘా

కర్నూలు జిల్లాలో నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ జిల్లా పోలీసు శాఖ డ్రోన్ పెట్రోలింగ్ ప్రారంభించింది. డీజీపీ కార్యాలయం నుంచి కేటాయించిన 3 నూతన డ్రోన్ కెమెరాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆవిష్కరించారు. డే, నైట్ విజన్ సౌకర్యంతో పనిచేసే ఈ డ్రోన్లు జిల్లావ్యాప్తంగా నిరంతర నిఘా నిర్వహించనున్నాయి. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ కాలేజీలు, పాఠశాలల ప్రత్యేక నిఘాకు ఉపయోగపడతాయన్నారు.


