News March 21, 2025

వేములవాడలో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శ్రీచైతన్య పాఠశాలలో పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్‌ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా విద్యార్థులు రాస్తున్న తీరును పరిశీలించి, పరీక్ష కేంద్రాల్లో ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News March 28, 2025

పల్నాడు జిల్లా టుడే టాప్ న్యూస్

image

☞ నరసరావుపేట: ఇఫ్తార్ విందులో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు,. ☞ సత్తనపల్లి: బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక. ☞ చిలకలూరిపేట: పరీక్షా కేంద్రంలో ఉపాధ్యాయుడికి పాముకాటు. ☞ మాచర్ల: సినిమా థియేటర్లో ఆర్డీఓ తనిఖీలు. ☞ క్రోసూరు: కేజీబీవీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. ☞ దాచేపల్లి: సిమెంట్ ఫ్యాక్టరీల ప్రభావిత గ్రామాలలో అధికారుల పర్యటన. 

News March 28, 2025

ఓబుళాపురం మైనింగ్ కేసుపై మే 6న తీర్పు

image

ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం రేపిన ఓబుళాపురం మైనింగ్ కేసు(OMC)లో ఎట్టకేలకు విచారణ ముగిసింది. మే 6న తీర్పు వెల్లడించనున్నట్లు CBI కోర్టు తెలిపింది. ఈ కేసులో నిందితులుగా గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్ తదితర ప్రముఖులు ఉన్నారు. 219 సాక్షులను విచారించడంతోపాటు 3,337 డాక్యుమెంట్లను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. 2009 నుంచి ఈ కేసు కొనసాగుతోంది.

News March 28, 2025

తెలంగాణ అన్ని మతాల ప్రజల సహా జీవనానికి ప్రతీక: కేటీఆర్

image

సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్దనగర్ డివిజన్‌లోని వారసిగూడలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కే.టీ.రామారావు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులు సర్వ మత సౌభ్రాతృత్వాన్ని చాటుతాయని అన్నారు. తెలంగాణ అన్ని మతాల ప్రజల సహా జీవనానికి ప్రతీకని చెప్పారు.

error: Content is protected !!