News December 21, 2025
వేములవాడ: ఈనెల 24న అరుణాచలం ప్రత్యేక యాత్ర ……

వేములవాడ నుంచి తమిళనాడులోని అరుణాచల క్షేత్రానికి ఈనెల 24వ తేదీన ప్రత్యేక బస్సు యాత్ర ఏర్పాటు చేసినట్లు వేములవాడ ఆర్టీసీ డిపో మేనేజర్ బి.శ్రీనివాస్ తెలిపారు. 25న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, 26న అరుణాచలం గిరి ప్రదక్షిణ, 27న తిరుమల, 28న జోగులాంబ అమ్మవారి దర్శనం ఉంటాయని, పెద్దలకు రూ. 6100, పిల్లలకు రూ.4850 చార్జీ ఉంటుందని వెల్లడించారు. వివరాలకు 99959225926 నంబర్ లో సంప్రదించాలన్నారు.
Similar News
News January 2, 2026
బాలింతలు ఏం తినాలంటే?

ప్రసవమయ్యాక కొన్నిరోజులపాటు బాలింతకు తేలికగా జీర్ణమయ్యే, బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలి. అప్పుడే బిడ్డకు సరిపడా పాలు పడతాయి. పాలు, నెయ్యి ఎక్కువగా తీసుకోవాలి. బీర, పొట్ల, సొర, కాకర, క్యారెట్, బీట్రూట్, బెండ వంటి కూరగాయలు ఆహారంలో చేర్చుకోవాలి. కిచిడీ, పులగన్నం తీసుకోవాలి. వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఇంగువ ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి గర్భాశయ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
News January 2, 2026
నిమిషంలోనే అంబులెన్స్ బయల్దేరింది: శ్రీకాకుళం DMHO

రణస్థలం మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాద సమయంలో 108 అంబులెన్స్ సేవలో సాంకేతిక సమస్య తప్ప మరే జాప్యం జరగలేదని DMHO డా.అనిత గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అంబులెన్స్ రాకలో ఎటువంటి నిర్లక్ష్యం లేదని సాంకేతిక సమస్య వలన సమాచారం చేరడం జాప్యం జరిగిందని ఆమె వెల్లడించారు. 8.08 గంటలకు సమాచారం అందిన వెంటనే 8.09 నిమిషాలకు అంబులెన్స్ బయలుదేరి 2 కి.మీ దూరంలో ఉన్న ప్రమాద స్థలానికి 5 నిమిషాల్లోనే చేరిందన్నారు.
News January 2, 2026
ఎన్నికల్లో పోటీ చేస్తాం: గురునాథరెడ్డి

వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబం కచ్చితంగా పోటీ చేస్తుందని అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ప్రకటించారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల నుంచి ప్రజలకు మేలు జరగలేదని విమర్శించారు. తాము నిరంతరం ప్రజలతోనే ఉండి పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులతో మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా గురునాథరెడ్డి 2009 ఎన్నిక, 2012 ఉప ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేసి గెలుపొందారు.


