News December 30, 2025
వేములవాడ: ఉదయం 8 గంటల తర్వాతే కోడె మొక్కుల చెల్లింపు

ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వేములవాడ శ్రీ భీమేశ్వర క్షేత్రంలో మంగళవారం ఉదయం కోడె మొక్కుల చెల్లింపు నిలిపివేశారు. ఉత్తర ద్వారం శ్రీ స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకునే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా ఉదయం ఎనిమిది గంటల వరకు కోడె మొక్కుల టికెట్లను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News December 30, 2025
మైనారిటీలపై మీ రికార్డు చూసుకోండి.. పాక్కు ఇండియా కౌంటర్

ఇండియాలో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయంటూ పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యలను విదేశాంగ శాఖ ఖండించింది. మైనారిటీల విషయంలో పాక్ అధ్వాన రికార్డు అందరికీ తెలుసని ఎద్దేవా చేసింది. ‘వివిధ మతాలకు చెందిన మైనారిటీలను పాక్ దారుణంగా, ప్లాన్ ప్రకారం బాధితులుగా మారుస్తుందనేది నిజం. మా వైపు వేలు చూపించినంత మాత్రాన అదేమీ మారదు’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
News December 30, 2025
డిసెంబర్ 30: చరిత్రలో ఈరోజు

✒1879: భగవాన్ రమణ మహర్షి జననం
✒1898: స్వాతంత్ర్య సమర యోధుడు యలమంచిలి వెంకటప్పయ్య జననం
✒1971: భౌతిక శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు విక్రం సారాభాయ్ మరణం(ఫొటోలో)
✒1973: తెలుగు సినిమా నటుడు చిత్తూరు నాగయ్య మరణం
✒1906: ముస్లిం లీగ్ పార్టీ స్థాపన
News December 30, 2025
వరంగల్: గర్భిణీ అండాశయం నుంచి 3.5 కిలోల కణతి తొలగింపు!

సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన సింధు వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో సోమవారం ప్రసవం కాగా 3.5 కిలోల ఆడ శిశువుకు జన్మించింది. అదే సమయంలో అండాశయం ఉన్న 3.5 కిలోల కణతిని గుర్తించిన వైద్యులు.. ఆపరేషన్ చేసి విజయవంతంగా తొలగించినట్లు ఆస్పత్రికి సూపరింటెండెంట్ డా.లక్ష్మీదేవి తెలిపారు. అస్త్రం ప్రొఫెసర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, అనస్తీషియా వైద్యులు పాల్గొన్నారు.


