News April 9, 2025
వేములవాడ: క్రికెట్ బాల్ తగిలి బాలుడి మృతి

క్రికెట్ బాల్ తగిలి బాలుడు మృతి చెందిన ఘటన ఓ కుటుంబంలో విషాదం నింపింది. వేములవాడలోని కోరుట్ల బస్స్టాప్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, మానస దంపతుల కుమారుడు అశ్విత్ రెడ్డి(11) ఈ నెల 3న ఇంటి పక్కన పిల్లలతో కలిసి క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలో బాల్ అతడి తలకు తాకడంతో గాయమైంది. చికిత్స కోసం అతడిని కరీంనగర్ అక్కడి నుంచి హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
Similar News
News December 30, 2025
అద్దంకి: ‘డోర్ డెలివరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి’

అద్దంకి ఆర్టీసీ డిపో నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, కాకినాడ, చిత్తూరు కడప, అనంతపురానికి 50 కేజీల బరువు ఉన్న పార్సిళ్లకు డోర్ డెలివరీ సౌకర్యం ఉంటుందని డీఎం రామ్మోహన్ రావు మంగళవారం తెలిపారు. పట్టణ పరిధిలో 10 కిలోమీటర్ల వరకు ఈ సౌకర్యం ఉంటుందని చెప్పారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
News December 30, 2025
నాగార్జున ఫిట్నెస్ సీక్రెట్ ఇదే

66 ఏళ్ల వయసులోనూ గ్లామర్, ఫిట్నెస్లో యంగ్ హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు కింగ్ నాగార్జున. తాజాగా తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో వెల్లడించారు. డైటింగ్ కంటే టైమ్కు ఫుడ్ తీసుకోవడమే తన ఆరోగ్య రహస్యమన్నారు. గత 45 ఏళ్లుగా ఒక్కరోజు కూడా జిమ్ మిస్ కాలేదని పేర్కొన్నారు. పాజిటివ్ థింకింగ్, మెంటల్ హెల్త్ కూడా కీలకమని చెప్పారు. 2025 సంవత్సరం తనకు వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఎంతో తృప్తినిచ్చిందని తెలిపారు.
News December 30, 2025
ఇంద్రకీలాద్రిపై నూతన సంస్కరణ

కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలందించే దిశగా ఆలయ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 500 అంతరాలయ దర్శన టికెట్ పొందిన భక్తులకు కేటాయించే ఉచిత లడ్డూ ప్రసాదాన్ని ఇకపై నేరుగా టికెట్ స్కానింగ్ పాయింట్ వద్దే పంపిణీ చేయనున్నారు. గతంలో దర్శనం తర్వాత ప్రసాదం కౌంటర్ల వద్దకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు స్కాన్ పాయింట్ వద్దే ఇవ్వడం వల్ల భక్తుల సమయం ఆదా అవుతుందని అధికారులు తెలిపారు.


