News April 9, 2025

వేములవాడ: క్రికెట్ బాల్ తగిలి బాలుడి మృతి

image

క్రికెట్ బాల్ తగిలి బాలుడు మృతి చెందిన ఘటన ఓ కుటుంబంలో విషాదం నింపింది. వేములవాడలోని కోరుట్ల బస్‌స్టాప్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, మానస దంపతుల కుమారుడు అశ్విత్ రెడ్డి(11) ఈ నెల 3న ఇంటి పక్కన పిల్లలతో కలిసి క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలో బాల్ అతడి తలకు తాకడంతో గాయమైంది. చికిత్స కోసం అతడిని కరీంనగర్ అక్కడి నుంచి హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

Similar News

News March 1, 2026

GDK: స్టేషన్‌లో పార్కింగ్ ఏంటని బైక్‌పై ప్రతాపం చూపించిన పోలీస్ అధికారి

image

RMG పోలీస్ కమిషనరేట్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుకు సంబంధించిన బైక్‌ను ఓ పోలీస్ అధికారి శనివారం ధ్వంసంచేశారు. అ ఠాణాలో రోజు పార్కింగ్ చేసి PDPLకి నిత్యం విధులు నిర్వహించేందుకు హోంగార్డు వెళ్తూ ఉంటాడు. ఇక్కడ పార్కింగ్ ఏంటని కోపగించుకున్న సదరు పోలీస్ అధికారి ఏకంగా బైక్‌పై తన ప్రతాపాన్ని చూపించారు. ఇష్టానుసారంగా పగలగొట్టి కసి తీర్చుకున్నారు. దీనిపై పోలీసు అధికారులకు ఫిర్యాదుచేసినట్లు తెలిసింది.

News March 1, 2026

NTR: హైకోర్టు గెస్ట్ హౌస్ పనులకు శంకుస్థాపన చేసిన CJI

image

అమరావతి హైకోర్టు సమీపంలో 6,300 చదరపు గజాల స్థలంలో నిర్మించనున్న గెస్ట్ హౌస్ పనులకు CJI జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సైట్‌లో సీఎం చంద్రబాబు, సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో కలసి CJI పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 50,000 చదరపు అడుగుల బిల్ట్ అప్ ఏరియాలో G+3 తరహాలో అధికారులు CRDA ఈ గెస్ట్ హౌస్‌ నిర్మించనున్నారు.

News March 1, 2026

నారయణపేటలో రేపే మెగా జాబ్ మేళా

image

నారాయణపేట జిల్లా కేంద్రంలోని శ్రీ చిట్టెంనర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. వివిధ ప్రతిష్టాత్మక కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు నిరుద్యోగ యువతీయువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ మెర్సీ వసంత కోరారు. అర్హత గల అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో ఉదయాన్నే కళాశాలకు హాజరు కావాలన్నారు.