News February 15, 2026

వేములవాడ క్షేత్రంలో భక్తజనసంద్రం.. 70 వేల మందికి దర్శనం

image

వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. మహాశివరాత్రి రోజున శనివారం రాత్రి 12:00 గంటల నుండి ఈరోజు ఆదివారం మధ్యాహ్నం 1:20 గంటల వరకు మొత్తం 70,189 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేసి దర్శనాలను సాఫీగా నిర్వహించారు.

Similar News

News February 21, 2026

ఏఐ మాయ.. ఐదేళ్లలో 80 కోట్ల ఉద్యోగాలు మాయం!

image

ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ జాబ్స్ పోతాయనే ఆందోళన ఎక్కువవుతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏఐ వ్యవస్థలు, రోబోలతో భవిష్యత్తులో 90% ఉద్యోగాలు, ఉపాధికి కోత పడొచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఐదేళ్లలో 30 కోట్ల జాబ్స్ పోతాయని ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ అంచనావేసింది. కానీ ఆ సంఖ్య 80 కోట్లకు పైనే అని కన్సల్టింగ్ సర్వీసుల కంపెనీ మెక్‌కిస్నీ చెప్పింది.

News February 21, 2026

T20 WC: సూపర్-8 ఫైట్ జరుగుతుందిలా..

image

లీగ్ దశ <<19197455>>ముగిసిన<<>> తర్వాత 2 గ్రూపుల్లో నాలుగేసి జట్లున్నాయి. ప్రతి గ్రూపులోని ఒక టీమ్ మిగిలిన మూడింటితో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అలా ఈ స్టేజీ ముగిసేలోపు 2 గ్రూపుల్లో టాప్‌-2లో ఉండే 4 జట్లు సెమీస్ చేరుతాయి. భారత్.. SA, జింబాబ్వే, విండీస్‌తో ఆడనుంది. మరో గ్రూపులో న్యూజిలాండ్, పాకిస్థాన్, ఇంగ్లండ్, శ్రీలంక ఉన్నాయి. సెమీస్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్ చేరుతుంది. సూపర్-8 షెడ్యూల్ పైన ఇమేజ్‌లో చూడవచ్చు.

News February 21, 2026

ఎలాంటి అవకాడో మొక్కలతో ఎక్కువ దిగుబడి వస్తుంది?

image

అవకాడోలను సాధారణంగా విత్తనాల నుంచి ప్రవర్ధనం చేస్తారు. అయితే అధిక దిగుబడినిచ్చే మొక్కల నుంచి అంటుకట్టడం మరియు మొగ్గ తొడగడం అనే రెండు పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేసిన మొక్కల నుంచి అధిక దిగుబడులు వస్తాయి. విత్తనాలను నేరుగా మట్టిలో నాటవచ్చు లేదా రబ్బర్, ప్లాస్టిక్ సంచులలో నర్సరీ మిశ్రమంలో 2 నుంచి 3 గింజలను నాటాలి. తోటలలో నాటడానికి ముందు 2 నుంచి 3 నెలల వరకు గ్రీన్‌హౌస్‌లలో అవకాడో మొక్కలను పెంచడం మంచిది.