News October 22, 2025
వేములవాడ: ‘ప్రభుత్వ ఆసుపత్రిల్లో ప్రసవాలు పెంచాలి’

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. వేములవాడ మండలం రుద్రవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణీలను ఎప్పటికప్పుడు గుర్తించి రికార్డులలో నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది విక్రమ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 22, 2025
పట్టణాలు, నగరాల్లో ఇక కామన్ జోనింగ్ విధానం

AP: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో జోనింగ్ నిబంధనలు ఒకేమాదిరి కాకుండా వేర్వేరుగా ఉన్నాయి. దీనివల్ల లైసెన్సులు, నిర్మాణ అనుమతులు ఇతర అంశాలలో సమస్యలు ఎదురవుతున్నాయి. దీని నివారణకు ప్రభుత్వం కామన్ జోనింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ తాజాగా <
News October 22, 2025
VZM: ‘సర్దార్ @ 150 కార్యక్రమాల్లో యువత చురుకుగా పాల్గొనాలి’

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “సర్దార్ @150” కార్యక్రమాల్లో యువత చురుకుగా పాల్గొనాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. స్థానిక నెహ్రూ యువ కేంద్రంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈనెల 31 నుంచి నవంబర్ 25వ తేదీ వరకు జరగనున్న ర్యాలీలు, పోటీల్లో విద్యార్థులు, యువత విరివిగా పాల్గొని పటేల్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు.
News October 22, 2025
కామవరపుకోట: పెట్రోల్ పోసుకొని మహిళ ఆత్మహత్య యత్నం

చిట్టీలు వసూల కాక ఆర్థికంగా ఇబ్బందులు పడిన ఓ మహిళ శరీరంపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కామవరపుకోట మండలం వీరిశెట్టి గూడెంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన రాజేశ్వరి వేసిన చిట్టీలు వసూలు కాక ఈ ఘాతుకానికి సిద్ధమైంది. కుటుంబీకులు ఆమెను ఓ ఆసుపత్రిలో చేర్చారు. దీనిపై తడికలపూడి ఎస్సై చిన్నారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.