News August 16, 2025
వేములవాడ: ఫైర్ స్టేషన్ అధికారికి ఉత్తమ సేవా పురస్కారం

వేములవాడ ప్రథమ అగ్నిమాపక అధికారి బి.రాజేంద్ర ప్రసాద్ ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో విధి నిర్వహణలో ఆయన చూపిన ఉత్తమ ప్రతిభకు గాను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ను పలువురు అభినందించారు.
Similar News
News August 16, 2025
KMR: జిల్లాలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు

కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. గతేడాది 170 రోడ్డు ప్రమాదాల్లో 179 మంది మరణించగా, 315 మంది గాయపడ్డారు. ఈ ఏడాది ఇదే కాలంలో 1129 ప్రమాదాలలో 135 మంది మరణించగా, 272 మంది గాయపడ్డారు. రోడ్డు ప్రమాదాల నివారణలో కామారెడ్డి జిల్లా పోలీసులు సాధించిన ఈ పురోగతిని రాష్ట్ర డీజీపీ డా. జితేందర్ అభినందించారు.
News August 16, 2025
కాశీబుగ్గలో 20 కేజీల గంజాయి స్వాధీనం

ఒడిశాకు చెందిన నలుగురు గంజాయి అక్రమ రవాణాదారులను పలాస రైల్వే స్టేషన్లో అరెస్టు చేసినట్టు కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. మోహనా బ్లాక్ పడొవ గ్రామానికి చెందిన నాయక్, రాహిత్ బిర, జునైలు, గుమ్మా గ్రామానికి చెందిన సురుసింగ్ వద్ద 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అరెస్టు చేసి పలాస కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో జైలుకి పంపించామని అన్నారు.
News August 16, 2025
HYD: ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి.. హత్య

ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ఘటన ఉప్పల్ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. రామంతపూర్లో నివాసముండే ఓ వ్యక్తి టింబర్ డిపోలో పని చేస్తున్నాడు. ఈ నెల 12న కుమారుడు కనిపించడం లేదంటూ PSలో ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజీ ఆధారంగా అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. కమర్ అనే వ్యక్తి బాలుడికి మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి గొంతు నులిమి హత్య చేశాడు. కేసు నమోదైంది.