News March 23, 2025
వేములవాడ: రాజన్న ఆలయంలో ఈనెల 30 నుంచి శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు

రాజన్న సన్నిధిలో ఈనెల 30 నుంచి ఏప్రిల్ 6 వరకు శ్రీరామ నవరాత్రోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈఓ వినోదొడ్డి తెలిపారు. 30న ఉగాది సందర్భంగా ఉదయం 9 గంటలకు ప్రత్యేకపూజలు, సాయంత్రం 4.30కు పంచాంగ శ్రవణం, పండిత సత్కారం ఉంటుందన్నారు. రాత్రి 8 గంటలకు స్వామివారిని పెద్దసేవపై ఊరేగిస్తారని తెలిపారు. ఏప్రిల్ 6న సీతారామచంద్రస్వామి వారి కళ్యాణోత్సవం ఉంటుందన్నారు.
Similar News
News September 17, 2025
హైదరాబాద్ సంస్థాన విలీన పోరాటంలో వికారాబాద్ వాసులు

నిజాం పాలకులకు, రజాకార్లకు వ్యతిరేకంగా వికారాబాద్ వాసులు వీరోచితంగా పోరాడారు. హైదరాబాద్ సంస్థానం విలీనం కోసం దొండేరావు జాదవ్, నారాయణస్వామి తమ గళాన్ని బలంగా వినిపించారు. దీంతో దొండేరావును 1947 సెప్టెంబర్ 17న నిజాం సైనికులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమయ్యాక ఆయన విడుదలయ్యారు. ఆయన త్యాగాలకు గుర్తుగా వికారాబాద్లో ఓ శిలాఫలకం ఏర్పాటు చేశారు.
News September 17, 2025
యూరియాకు గుళికలు కలుపుతున్నారా?

వరి సాగులో చాలా మంది రైతులు మొదటి దఫా యూరియా వేసేటప్పుడు బస్తా యూరియాకు 4-5 కిలోల గుళికల మందును కలిపి చల్లుతారు. పైరు బాగా పెరగడానికి యూరియా.. పురుగుల నివారణకు గుళికల మందు ఉపయోగపడుతుందనేది రైతుల భావన. కానీ పురుగుల కట్టడికి ఎకరాకు మందు రకాన్ని బట్టి 8-10 కిలోల గుళికలు అవసరం. తక్కువ వేస్తే పురుగులు వాటిని తట్టుకొని నిలబడతాయి. అందుకే రైతులు గుళికల మందు వాడకంలో వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం.
News September 17, 2025
VZM: సిరిమాను చెట్టుకు బొట్టు పెట్టే కార్యక్రమం

విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను, ఇరుసు చెట్లకు వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ బుధవారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. గంట్యాడ (M) కొండతామరపల్లిలోని చల్ల అప్పలనాయుడు కల్లంలో గుర్తించిన ఈ చెట్లకు ఉదయం 9.15 గంటలకు బొట్టు పెట్టే కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పూజారి బంటుపల్లి వెంకటరావు, ఈవో శిరీష, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస్, ప్రెసిడెంట్ భాస్కర్, భక్తులు పాల్గొన్నారు.