News March 15, 2025
వేమూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం వేమూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కఠివరంకు చెందిన బత్తి శ్రీధర్(28) గుంటూరుకు చెందిన తోట సోము కుమార్ లు కొల్లూరు నుంచి ద్విచక్ర వాహనంపై తెనాలి వెళుతుండగా ఎదురుగా వస్తున్న టాటా ఏసీని ఢీకొట్టారు. శ్రీధర్ అక్కడికక్కడే మృతచెందగా సోము కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవికృష్ణ తెలిపారు.
Similar News
News February 27, 2026
ఎన్టీఆర్: MBA పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో 2025 నవంబర్ నెలలో జరిగిన ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 3వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు మార్చి 9వ తేదీ లోపు రూ.1,860 నగదు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చూడాలన్నారు.
News February 27, 2026
రేపు అలిపిరికి రానున్న ఆర్కియాలజీ బృందం

శిథిలావస్థలో ఉన్న అలిపిరి సమీపంలోని పురాతన మండపాన్ని ఆర్కియాలజీ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల తొలగించారు. టీటీడీ దాతల సహకారంతో నిర్మించనున్న ఈ మండపం పనుల తనిఖీ కోసం సెంట్రల్ ఆర్కియాలజీ అధికారులు శనివారం రానున్నారు. పునర్నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. తొలగింపులో తీసిన రాళ్లను ఏలా భద్రపరిచారనే విషయాలతో పాటు పలు సూచనలు చేసే అవకాశం ఉంది.
News February 27, 2026
గ్రేటర్ వరంగల్కు 100 ఎలక్ట్రిక్ బస్సులు: కలెక్టర్

ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు గ్రేటర్ వరంగల్ నగరానికి ప్రభుత్వం 100 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసిందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. ఆర్టీసీ, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. బస్సుల నిర్వహణకు అవసరమైన డిపో స్థలాన్ని త్వరగా అప్పగించాలని ఆదేశించారు. పర్యావరణ హితమైన రవాణా సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.


