News February 8, 2026
వైఎస్ జగన్ను కలిసిన ఒంగోలు ఎంపీ మాగుంట

చెన్నైలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల వివాహం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైస్ జగన్ మోహన్ రెడ్డి, మాగుంట ఇరువురూ పలకరించుకున్నారు. మాగుంటను జగన్ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీలో రాజకీయాలు ఏమి లేవని సమాచారం.
Similar News
News February 10, 2026
రేపే అసెంబ్లీ: బూచేపల్లి, తాటిపర్తి ఎంట్రీ ఇస్తారా..?

రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా YCP MLAలు తాటిపర్తి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్ హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో సమావేశాలకు దూరంగా ఉన్న వీరు కీలకమైన బడ్జెట్ సమావేశాల్లోనైనా అడుగుపెడతారా అన్న అంశంపై ఆయా నియోజకవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. సభలో పాల్గొని సమస్యలపై గళమెత్తి నిధులు రాబట్టాలని స్థానికులు కోరుతున్నారు.
News February 10, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లా ర్యాంకింగ్లో “ఒంగోలు” టాప్

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నియోజకవర్గాల ర్యాంకుల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు (86%) అగ్రస్థానంలో నిలిచింది. కొండపి (84%), దర్శి (82%), అద్దంకి (81%), పర్చూరు (80%), చీరాల (79%) నియోజకవర్గాలు మెరుగైన ‘A’ గ్రేడ్ సాధించాయి. మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు 77 శాతానికి పైగా మార్కులు పొందగా.. సంతనూతలపాడు, యర్రగొండపాలెం 75 శాతంతో చివరి స్థానాల్లో నిలిచాయి.
News February 10, 2026
ప్రకాశం: ‘సొంత చెల్లిపై అన్న లైంగిక దాడి’

సొంత చెల్లిపై లైంగిక దాడికి పాల్పడ్డ అన్నకు విజయవాడ పోక్సో కోర్టు సోమవారం ‘జీవిత ఖైదు’ విధించింది. ప్రకాశం(D) కొండపి(M) పెట్లూరుకి చెందిన ఓ వ్యక్తికి ముగ్గురు సంతానం. భార్య విడిపోయి ఇద్దరు కూతుర్లతో కృష్ణా జిల్లాకు వెళ్లగా కొడుకు తండ్రి వద్దే ఉన్నాడు. ఈ క్రమంలో అమ్మవద్దకు వెళ్లొస్తానన్న కొడుకు పెద్దచెల్లి(17)పై లైంగిక దాడి చేశాడు. కుమార్తె గర్భిణీ కాగా తల్లి కేసు పెట్టడంతో నిన్న శిక్ష పడింది.


