News April 10, 2025
వైఎస్ జగన్ రామగిరి పర్యటన.. కేసు నమోదు

మాజీ సీఎం వైఎస్ జగన్ రామగిరి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద పోలీసుల మీద దాడి ఘటనపై కేసు నమోదైంది. వైసీపీ శ్రేణులు హెలికాప్టర్ వద్దకు దూసుకెళ్లగా అడ్డుకోబోయిన పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏఆర్ హెడ్కానిస్టేబుల్ రంగారెడ్డి అస్వస్థతకు గురై అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు సీకేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 16, 2025
మంచిర్యాల: దివ్యాంగురాలి అనుమానాస్పద మృతి

MNCL(D) దండేపల్లి(M) వెంకటరావుపేటకు చెందిన మల్లేషం-పోషవ్వ దంపతుల కూతురు దివ్యాంగురాలైన అర్చన(15) KNR జిల్లా వావిలాలపల్లిలో శనివారం అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె సోదరుడు అశ్రిత్ పరిస్థితి విషమంగా ఉంది. తల్లి కిరాణా షాప్కు వెళ్లి వచ్చే సరికి ఇద్దరూ స్పృహ కోల్పోయి కనిపించారు. ఆసుపత్రికి తరలించగా అర్చన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటన జరిగినప్పటి నుంచి వారి తండ్రి మల్లేషం కనిపించడం లేదు.
News November 16, 2025
ప్రజా జీవితంలోకి రాబోతున్నా: ఆశ కిరణ్

వంగవీటి రంగా ఫ్యామిలీలో పొలిటికల్ హీట్ రాజుకుంది. నేడు ఆశ కిరణ్ విజయవాడలో తన తండ్రి రంగా విగ్రహానికి నివాళులర్పించారు. ఇప్పటి నుంచి ప్రజా జీవితంలోకి రాబోతున్నా అని ఆమె అన్నారు. రాజకీయాల్లో శూన్యత ఉందని, వైసీపీ ఆహ్వానంపై ఇప్పుడే స్పందించలేనని చెప్పారు. రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు.
News November 16, 2025
కుమారుడి ఫస్ట్ బర్త్డే.. ఫొటో షేర్ చేసిన రోహిత్

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్లో ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న తన కుమారుడు అహాన్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలను ఆయన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ‘సమయం చాలా వేగంగా ముందుకు వెళ్తోంది. కానీ ప్రతి క్షణాన్ని మేము ఆస్వాదిస్తున్నాం’ అని పేర్కొన్నారు.


