News April 10, 2025
వైఎస్ జగన్ రామగిరి పర్యటన.. కేసు నమోదు

మాజీ సీఎం వైఎస్ జగన్ రామగిరి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద పోలీసుల మీద దాడి ఘటనపై కేసు నమోదైంది. వైసీపీ శ్రేణులు హెలికాప్టర్ వద్దకు దూసుకెళ్లగా అడ్డుకోబోయిన పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏఆర్ హెడ్కానిస్టేబుల్ రంగారెడ్డి అస్వస్థతకు గురై అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు సీకేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 18, 2025
MEMU రైలు అనంతపురం వరకు..

అనంతపురం జిల్లా ప్రజలకు రైల్యే శాఖ తీపి కబురు చెప్పింది. పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరుకు నడుస్తున్న MEMU రైలును అనంతపురం వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఈ రైలు అనంతపురం-బెంగళూరు మధ్య పరుగులు పెట్టనుంది. KSR బెంగళూరులో ఉ.8.35 గంటలకు బయలు దేరి అనంతపురానికి మ.1.55 గంటలకు చేరుకుంటుంది. తిరిగి అనంతలో మ.2.10 గంటలకు బయలుదేరి రాత్రి 7.50 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.
News April 18, 2025
గుమ్మగట్ట: కరెంట్ షాక్తో టెన్త్ విద్యార్థి మృతి

గుమ్మగట్ట మండలం గొల్లపల్లిలో గురువారం రాత్రి విషాద ఘటన జరిగింది. గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి కార్తీక్ (16) ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్తో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. తండ్రితో కలిసి కుమారుడు పొలానికి వెళ్లాడు. మోటార్ ఆన్ చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. యువకుడు గత నెలలోనే పది పరీక్షలు రాశాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాయదుర్గం ఆసుపత్రికి తరలించారు.
News April 18, 2025
కియా ఇంజిన్ల చోరీ.. కీలక అప్డేట్

పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమలో 900 కారు ఇంజిన్ల చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ ఘటనలో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇక్కడ చోరీ చేసిన ఇంజిన్లను తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలో విక్రయించినట్లు సమాచారం. కొనుగోలుదారులు ఎవరన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. మరోవైపు ఇప్పటికే అరెస్టైన వారిని త్వరలో కస్టడీకి తీసుకొని విచారించనున్నారు.