News September 23, 2025
వైకుంఠం జ్యోతి ఎవరు?

ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిగా వైకుంఠం జ్యోతి నియమితులయ్యారు. <<17795004>>వైకుంఠం<<>> ఫ్యామిలీ ఆవిర్భావం నుంచి టీడీపీలో కొనసాగుతోంది. జ్యోతి మామ శ్రీరాములు 1995లో KDCC బ్యాంకు ఛైర్మన్గా పనిచేశారు. 2006లో ఆయన హత్యకు గురయ్యారు. తర్వాత తనయుడు, జ్యోతి భర్త ప్రసాద్ 2011లో ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. పలుమార్లు MLA టికెట్ ఆశించినా అవకాశం రాలేదు. పార్టీలోనే కొనసాగుతున్న ఆ ఫ్యామిలీకి మరోసారి ఇన్ఛార్జి పదవి దక్కింది.
Similar News
News September 23, 2025
VJA: ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పుట్టిల్లు.. ధనకొండ

ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన దుర్గమ్మ ముందుగా మొగల్రాజపురంలో పాదం మోపి అక్కడి నుంచి ఇంద్రకీలాద్రికి చేరారని ప్రతీతి. దీనికి ముందుగా దక్షిణాభి ముఖంగా మొగల్రాజపురం(ధనకొండ)లోని కొండపై ఒక చిన్న గుహలో శ్రీ చక్రపీఠం, పాదాలు, నేత్రాల రూపంలో కొలువుదీరారని భక్తులు చెబుతుంటారు. దసరా ఉత్సవాల్లో ప్రతి రోజు రాత్రివేళ దుర్గమ్మ ఇంద్రకీలాద్రి నుంచి మొగల్రాజపురంలోని ధనకొండ ఆలయానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం.
News September 23, 2025
ప్లాన్ ప్రకారం రెచ్చిపోతున్న పాక్ ప్లేయర్లు!

పాక్ క్రికెటర్లు ప్లాన్ ప్రకారం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. 6 రఫేల్ జెట్లను కూల్చామంటూ(6-0) భారత్తో మ్యాచ్లో రవూఫ్ సంజ్ఞలు చేసిన విషయం తెలిసిందే. దీన్ని ఉమెన్ క్రికెటర్లూ అనుసరిస్తున్నారు. నిన్న SAతో జరిగిన ODIలో పాక్ ఉమెన్ ప్లేయర్స్ సిద్రా అమీన్, నష్రా సందూ చేతి వేళ్లతో 6 నంబర్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఫొటోలను పాక్ ఫ్యాన్స్ షేర్ చేస్తుండగా భారత నెటిజన్లు కౌంటరిస్తున్నారు.
News September 23, 2025
గత ప్రభుత్వం 3,116 తప్పుడు కేసులు పెట్టింది: హోం మంత్రి

రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం3,116మందిపై తప్పుడు కేసులు పెట్టినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మంగళవారం శాసనమండలిలో మాట్లాడుతూ.. నిరుద్యోగులపై కేసులు పెట్టిన కారణంగా ఉద్యోగాలకు ఎంపికైన వారు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పర్యటించిన ప్రాంతాల్లో సంబంధిత నేతలను హౌస్ అరెస్ట్ చేసేవారని అన్నారు. సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడితే అరెస్ట్ చేసేవారన్నారు.