News May 19, 2024

వైజాగ్ వారియర్స్‌ టీంకు సామర్లకోట యువకుడు

image

ఆంధ్ర ప్రీమియర్ లీగ్- వైజాగ్ వారియర్స్‌కు కాకినాడ జిల్లా క్రీడాకారుడు పెంకె మణికంఠ గంగాధర్ ఎంపికయ్యాడు. సామర్లకోటలోని వీరరాఘవపురానికి చెందిన గంగాధర్ క్రికెట్‌లో మంచి ఆటతీరు కనబర్చడంతో ప్రీమియర్ వైజాగ్ వారియర్స్‌కు ఎంపిక చేసినట్లు క్రికెట్ సంఘం నేతలు వివరించారు. మణికంఠ ఎంపిక పట్ల జిల్లా క్రీడా సంఘం అధ్యక్షులు శివకుమార్, కార్యదర్శి సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. గంగాధర్‌కు అభినందనలు తెలిపారు.

Similar News

News October 15, 2024

తూ.గో: భారీ వర్షాలు, కంట్రోల్ రూమ్ నంబర్లు..ఇవే

image

భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సమస్యలు ఉంటే అధికారులు నిత్యం అందుబాటులో ఉండేలా జిల్లా వ్యాప్తంగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఏవైనా కరెంట్ సమస్యలు ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి.
➤రాజమండ్రి సర్కిల్-7382299960
➤కాకినాడ డివిజన్-9493178718
➤పెద్దాపురం డివిజన్-9493178728
➤అమలాపురం డివిజన్-9440904477
➤రామచంద్రపురం డివిజన్-9493178821

News October 14, 2024

మారేడుమిల్లి: పరుగు పరుగున వెళ్లినా ప్రాణాలు దక్కలేదు

image

మండలంలోని సున్నంపాడు పంచాయతీ పరిధిలోని నూరుపూడికి చెందిన కె.తమ్మిరెడ్డికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. రహదారి సరిగ్గా లేకపోవడం, మార్గమధ్యలో పెద్ద కొండ కాలువ ఉండడంతో అంబులెన్స్ రావడానికి అవకాశం లేకపోయింది. దీనితో గ్రామస్థులు తమ్మిరెడ్డిని డోలీ ద్వారా పరుగు పరుగున 8 కిలోమీటర్లు నడిచి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మార్గమధ్యలోనే సున్నంపాడు వద్ద మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు.

News October 14, 2024

అమలాపురం: నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం రద్దు

image

అమలాపురంలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించాల్సి ఉన్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు మద్యం షాపుల లైసెన్సుల లాటరీ ప్రక్రియ నేపథ్యంలో కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. జిల్లాలో అన్ని డివిజన్, మండల స్థాయి కార్యాలయాలలో ఈ కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది తెలిపారు.