News October 9, 2025
వైద్య విద్యపై జగన్ది దుష్ప్రచారం: పల్లా

పీపీపీ విధానంపై జగన్మోహన్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. తన హయాంలోనే జీవోలు 107, 108, 133 ఇచ్చి 50% సీట్లను ప్రైవేటు కోటాకు కేటాయించిన జగన్, ఇప్పుడు విమర్శించడం హాస్యాస్పదమన్నారు. కేవలం 18% పనులు చేసిన జగన్ సర్కార్ అసమర్థత వల్లే 1,750 సీట్లు రద్దయ్యే దశకు వచ్చాయని, తమ పీపీపీ విధానంతో ఆ సీట్లను కాపాడామని స్పష్టం చేశారు.
Similar News
News October 9, 2025
విశాఖ: ‘డ్వాక్రా మహిళలకు ఈనెల 26 వరకు వైద్య పరీక్షలు’

డ్వాక్రా మహిళలకు సఖి సురక్ష కార్యక్రమం కింద ఈనెల 26 వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డ్వాక్రా మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. 35 ఏళ్లు దాటిన మహిళలకు వైద్య పరీక్షలు చేస్తామన్నారు. వైద్య పరీక్షల్లో వ్యాదిని గుర్తించి చికిత్స అందిస్తామని మెప్మా డైరెక్టర్ తేజ భరత్ పేర్కొన్నారు.
News October 9, 2025
VMRDA కమిషనర్ కే.ఎస్.విశ్వనాథన్ బదిలీ

VMRDA కమిషనర్ కే.ఎస్.విశ్వనాథన్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్గా ఆయనను నియమించారు. VMRDA కమిషనర్గా విశ్వనాథన్ పలు సంస్కరణలను చేపట్టారు. VMRDA పరిధిలో ఉన్న టూరిజం, కళ్యాణమండపాలను అభివృద్ధి దిశగా తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషించారు.
News October 9, 2025
VMRDA కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్

ఎల్ఆర్ఎస్ పథకం కింద అనధికార లేఔట్లలోని స్థలాల క్రమబద్ధీకరణ కోసం VMRDA కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఈనెలాఖరులో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల గడువు ముగుస్తుంది. వీఎంఆర్డీఏకు ఇప్పటివరకు 585 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. ఎల్ఆర్ఎస్కి దరఖాస్తు చేసుకునే విధానంపై హెల్ప్ డెస్క్లో అవగాహన కల్పిస్తున్నారు.