News March 26, 2024

వైపాలెం: గుండె పోటుతో గిరిజనుడు మృతి

image

యర్రగొండపాలెం మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని గాంధీ నగర్ గిరిజన గూడేనికి చెందిన కుడుముల వీరన్న (33) గుండె పోటుతో మంగళవారం మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వీరన్నకు గుండెల్లో నొప్పిగా ఉండడంతో ఐటీడీఏ అంబులెన్స్‌కు సమాచారం అందజేసి వీరన్నను యర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తీసుకువచ్చారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారన్నారు.

Similar News

News February 7, 2025

చీమకుర్తి: ‘న్యాయం జరిగే వరకు నా శవాన్ని తీయొద్దు’

image

చీమకుర్తి మండలం ఏలూరువారిపాలెంకి చెందిన శీను(35) గురువారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రాసిన లెటర్‌తో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో ‘నా చావుకు నా భార్య కుటుంబం. వాళ్లను వదిలిపెట్టొద్దు. నాకు న్యాయం జరిగేవరకు నా శవం కుళ్లినా తీయకండి. నాకు 10 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. మెదటి రాత్రి తర్వాతి నుంచి నా భార్యతో గొడవలు జరుగుతున్నాయి.’ అని లెటర్లో పేర్కొన్నాడు.

News February 7, 2025

చీమకుర్తి: 6 పేజీల సూసైన్ నోట్‌తో మృతి

image

చీమకుర్తి మండలం ఏలూరువారిపాలెంకి చెందిన శీను(35) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలలోనికి వెళ్తే.. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకి కారణం అయ్యుండొచ్చని స్థానికులు తెలిపారు. ఆత్మహత్య చేసుకునే ముందు శీను రాసిన ఆరు పేజీల లేఖను తన జేబులో గుర్తించారు. ‘నా ఇద్దరు పిల్లలు జాగ్రత్త’ అంటూ తాను రాసిన లేక గ్రామ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

News February 7, 2025

ఒంగోలు: విద్యాశాఖ అధికారులతో సమావేశమైన కలెక్టర్

image

పాఠశాలల పునఃనిర్మాణానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ప్రతి మండలం నుంచి తయారు చేయబడిన పీపీటీలను కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం రివ్యూ చేశారు. మండల విద్యాశాఖాధికారులు తయారు చేసిన పీపీటీల ద్వారా వారి మండలాలలో పాఠశాల పునఃనిర్మాణం చేపట్టిన తరువాత ఏర్పాటుచేయబోయే పాఠశాలల వివరాలు తగిన ఆధారాలతో కలెక్టర్‌కి వివరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

error: Content is protected !!