News February 2, 2025

వైసీపీపై రెచ్చిపోయిన నాగబాబు

image

పుంగనూరులోని సోమల జడ్పీ హై స్కూల్ మైదానంలో ఆదివారం ‘జనంలోకి జనసేన’ కార్యక్రమంలో వైసీపీపై జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది. అప్పుడే వైసీపీ గూండాలు, సన్నాసులు ఇంకా అవి చేయలేదు, ఇవి చేయలేదని అంటున్నారు. ఇప్పటికే తాము పెన్షన్ పెంపు, ఏడాదికి మూడు సిలిండర్లు, రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాలు, డీఎస్సీ, పోలీస్ పోస్టులకు చర్యలు చేపట్టాం’ అని పేర్కొన్నారు.

Similar News

News February 2, 2025

బాలుడి ఆవిష్కరణకు సీఎం రేవంత్ ప్రశంస

image

TG: హైబ్రిడ్ సైకిల్‌ను రూపొందించిన 14 ఏళ్ల చిన్నారి గగన్ చంద్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఈ చిన్నారి ఆవిష్కరణ తన దృష్టిని ఆకర్షించిందని ట్వీట్ చేశారు. అతనికి అభినందనలు తెలిపారు. మరిన్ని పరిశోధనలు, ఆవిష్కరణలు చేసేందుకు గగన్‌కు మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. కాగా గగన్ సోలార్, బ్యాటరీ, పెట్రోల్‌తో నడిచే సైకిల్‌ను రూపొందించాడు.

News February 2, 2025

BREAKING: చరిత్ర సృష్టించిన భారత్

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5వ T20లో భారత్ చరిత్ర సృష్టించింది. T20Iలో పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు చేసింది. అభిషేక్ శర్మ(94*), తిలక్ వర్మ(24) విధ్వంసంతో 6 ఓవర్లలో భారత్ 95/1 రన్స్ చేసింది. ఇప్పటివరకు 2021లో స్కాట్లాండ్‌పై చేసిన 82/2 పవర్‌ప్లేలో భారత్‌కు అత్యధిక స్కోరు కాగా, ఆ రికార్డును తాజాగా బ్రేక్ చేసింది. ప్రస్తుతం స్కోరు 9 ఓవర్లలో 136-2గా ఉంది.

News February 2, 2025

ఆండ్ర ఎస్ఐపై విచారణకు ఆదేశం

image

ఆండ్ర ఎస్ఐ సీతారాములు తీరుపై విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ విచారణకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కొంతమంది రాజకీయ నాయకులను ఆయన కలిసినట్లుగా వచ్చిన ఆరోపణలపై బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డిని విచారణ చేసి నివేదిక పంపాలని ఆదేశించామన్నారు. విచారణలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు తేలితే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఎస్పీ తెలిపారు.