News March 20, 2024

వైసీపీలో చేరిన బుచ్చి టిడిపి కీలక నేత

image

బుచ్చిరెడ్డిపాలెం పట్టణానికి చెందిన టిడిపి ముఖ్య నాయకుడు గుత్తా శ్రీనివాసులు బుధవారం ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనకి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మండలపార్టీ అధ్యక్షుడు చెర్లో సతీష్ రెడ్డి, బుచ్చి నగర సచివాలయాలు కన్వీనర్ మోర్ల మురళి, 14 వార్డుకౌన్సిలర్ ప్రసాద్ పాల్గొన్నారు.

Similar News

News July 5, 2024

గూడూరు మీదుగా వెళ్ళే పలు రైళ్లు రద్దు

image

గూడూరు మీదుగా వెళ్లే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. విజయవాడ డివిజన్ పరిధిలో జరిగే నాన్ ఇంటర్ లాక్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు3 నుంచి 10వ తేదీ వరకు విజయవాడ-గూడూరు, గూడూరు-విజయవాడ మెమూ, ఆగస్టు 4-11 వరకు విజయవాడ-చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్ ప్రెస్, ఆగస్టు 5-10 వరకు చెన్నై సెంట్రల్-విజయవాడ జనశతాబ్ధి ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

News July 5, 2024

జగన్ పర్యటనతో వైసీపీ ఊపందుకుంది: కాకాణి

image

నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు మాట్లాడారు. గురువారం నెల్లూరులో మాజీ సీఎం జగన్ పర్యటన విజయవంతంగా జరిగిందని వైసీపీ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. జగన్ పర్యటనతో కార్యకర్తలకు ఆత్మస్థైర్యం వచ్చిందన్నారు.మళ్లీ వైసీపీ పుంజుకుంటోందని వ్యాఖ్యానించారు.

News July 5, 2024

దేవదాయ శాఖ మంత్రితో పొంగూరు నారాయణ భేటీ

image

రాష్ట్ర దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖామంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డితో మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరు న‌గ‌రం సంత‌పేట‌లోని ఆనం నివాసంలో మంత్రిని పొంగూరు నారాయ‌ణ మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. మంత్రి ఆనంకు నారాయ‌ణ పుష్ప‌గుచ్ఛం అంద‌చేసి శాలువాతో స‌త్క‌రించారు. ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నట్లు సమాచారం.