News February 13, 2025
వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్గా కురసాల

వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్గా కాకినాడకు చెందిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ విజయ్ సాయి రెడ్డి రాజీనామా చేయడంతో ఇప్పటివరకు ఆ పదవి ఖాళీగా ఉంది.
Similar News
News October 25, 2025
భూ భారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

ప్రభుత్వం చేపట్టిన భూభారతి కార్యక్రమం కింద రైతుల భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం వర్ధన్నపేట తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె, భూభారతి దరఖాస్తులపై సమీక్ష జరిపారు. పెండింగ్లో ఉన్న ఆర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని, క్షేత్రస్థాయి పరిశీలనను వేగవంతం చేయాలని సూచించారు.
News October 25, 2025
వనపర్తి: ప్రజావాణి ప్లేస్ తాత్కాలికంగా మార్పు

వనపర్తి జిల్లాలో ఈనెల 27న నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమం వచ్చే సోమవారం సాధారణంగా జరిగే కలెక్టరేట్ మీటింగ్ హాల్ (IDOC) లో కాకుండా, RDO కార్యాలయం సమావేశ మందిరం (రూమ్ 3) నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో 27న ఎక్సైజ్ శాఖ లాటరీ పద్ధతి ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు కార్యక్రమం ఉండటంతో ప్రజావాణి ప్రదేశం తాత్కాలికంగా మార్పు చేశామన్నారు.
News October 25, 2025
ఫోన్ చేసి పిలిపించి… గోదాం తీయించి..!

వర్ధన్నపేట పట్టణంలోని పౌరసరఫరాల శాఖ గిడ్డంగి తాళం వేసి ఉండటంపై కలెక్టర్ సత్యశారద ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఫోన్ చేసి రప్పించి ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ శృతి వర్షిని, పౌరసరఫరాల అధికారి సంధ్యారాణితో కలిసి గిడ్డంగిని పరిశీలించారు. వారు క్షేత్ర స్థాయిలో స్టాక్ రిజిస్టర్ను, గోదాంలోని బియ్యం నిల్వ వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నివేదికను కలెక్టర్కు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.


