News April 8, 2025
వైసీపీ కార్యకర్తలపై దాడులను సహించం: కాటసాని

అధికార పార్టీ నాయకుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసీపీ శ్రేణులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి భరోసా ఇచ్చారు. బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంట్లలో సోమవారం నూతన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ శ్రేణులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని కాటసాని హెచ్చరించారు.
Similar News
News April 17, 2025
కర్నూలు: అక్షరాస్యతకై ‘ఉల్లాస్’ కార్యక్రమం

వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన ఉల్లాస్ పథకాన్ని క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేయాలని అధికారులను డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ ఆదేశించారు. బుధవారం కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్లో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో “ఉల్లాస్” కార్యక్రమంపై జిల్లాస్థాయి కన్వర్జెన్సీ కమిటీ సమావేశాన్ని డీఆర్వో నిర్వహించారు. కార్యక్రమం అమలుపై అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
News April 16, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ మాదక ద్రవ్య మోసాలపై QR కోడ్: కర్నూలు SP
➤ ఎమ్మిగనూరులో YCP నుంచి TDPలోకి చేరికలు
➤ కర్నూలు TDP కార్యాలయంపై దాడి.. నలుగురి అరెస్టు
➤ఎమ్మిగనూరు విద్యార్థినికి లోకేశ్ సన్మానం
➤ కోడుమూరు: ముగ్గురు వీఆర్వోలపై బదిలీవేటు
NOTE:- పైన టూల్ బార్లో లొకేషన్ మీద, తర్వాత ‘వి’ సింబల్ని క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా ఎడిషన్ వార్తలను కేవలం 5 నిమిషాల్లోనే తెలుసుకోండి.
News April 16, 2025
కర్నూలు: మాదక ద్రవ్య మోసాలపై QR కోడ్

కర్నూలు జిల్లాలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం పేర్కొన్నారు. ఆయా మండలాల్లోని పోలీసు స్టేషన్లలో పబ్లిక్ ప్రదేశాల్లో క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసి, వాటిని స్కాన్ చేసి డ్రగ్స్ సంబంధించిన సమాచారం తెలపాలని ప్రజలను కోరుతున్నారు.