News June 20, 2024
వైసీపీ కౌన్సిలర్లపై దాడి దురదృష్టకరం: గడికోట
రాయచోటిలో వైసీపీ కౌన్సిలర్లపైన దాడి చేయడం దురదృష్టకరమని వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణానికి అలవాటుపడ్డ రాయచోటి ప్రజలకు ఈ రకమైన దాడులు చేసి భయాందోళనలకు గురిచేయడం సరైన పద్ధతి కాదన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి ఘటనలు జరగనీయకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.
Similar News
News October 4, 2024
కడప: YCPకి మాజీ మంత్రి కుమారుడి రాజీనామా
జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మున్సిపల్ ఛైర్మన్ మూలే హర్షవర్ధన్ రెడ్డి శుక్రవారం ఉదయం వైసీపీకి రాజీనామా చేశారు. ఇతను మాజీ హోమ్ మినిస్టర్ మైసూరారెడ్డి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డికి స్వయానా పెదనాన్న కుమారుడు. ఈయన గడిచిన ఎన్నికల్లో కూడా వైసీపీ పక్షాన క్రియాశీలకంగా వ్యవహరించారు. హర్షవర్ధన్ రెడ్డి గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు.
News October 4, 2024
కడప: అధికారుల పేరుతో నగదు వసూలు.. తస్మాత్ జాగ్రత్త
కడప జిల్లాలో ఉన్నతాధికారుల పేరుతో సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లు వసూళ్లకు పాల్పడుతున్నాడని, అలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శివ శంకర్ సూచించారు. ఉన్నతాధికారులు, జిల్లా అధికారుల పేరు, ఫోటో పెట్టి వాట్సాప్ ఖాతాను సైబర్ నేరగాళ్లు సృష్టించి అత్యవసరంగా డబ్బు పంపాలని మెసేజ్లు పంపిస్తున్నారన్నారు.
ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు ఎవరూ డబ్బు కానీ పంపాలని ఎప్పుడు అడగరనేది తెలిపారు.
News October 4, 2024
కడప JC అదితి సింగ్కి మరో కీలక పదవి
కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) వైస్ ఛైర్మన్గా ప్రస్తుత కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ను నియమిస్తూ.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకు వైస్ ఛైర్మన్గా ఉన్న వైఓ నందన్ సీడీఎంఏ డీడీగా బదిలీ అయిన నేపథ్యంలో ప్రభుత్వం జేసీకి ఇన్ఛార్జి వైస్ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించారు.