News May 17, 2024
వైసీపీ నాయకుల తీరు వల్లే హింసాత్మక ఘటనలు: ఎంఏ గఫూర్

వైసీపీ నాయకుల తీరు కారణంగానే రాష్ట్రంలో ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ ఆరోపించారు. ఎన్నికల అనంతరం హింస చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. మాచర్ల, తాడిపత్రి, తిరుపతిలో దాడులకు వైసీపీనే కారణమని విమర్శించారు. రాజంపేటలో ఉన్న అధికారి తాడిపత్రికి వచ్చి ఎలా దాడులు చేస్తారని ప్రశ్నించారు. వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News October 2, 2025
ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

ఈనెల 16న ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలుకు వస్తున్నందున భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీస్ అధికారులతో చర్చించి, పలు ప్రాంతాలను తనిఖీ చేశారు. నగరంలో జీఎస్టీ సంస్కరణలపై రోడ్డు షో నిర్వహిస్తున్నందున వాహనాల పార్కింగ్, హెలిపాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. సిల్వర్ జూబ్లీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బి క్యాంప్, నంద్యాల చెక్ పోస్ట్ ప్రాంతాలను పరిశీలించారు.
News October 1, 2025
బన్నీ ఉత్సవాన్ని సంప్రదాయ సంబరంగా జరుపుకుందాం: ఎస్పీ

బన్నీ ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని పటిష్ఠ చర్యలు చేపట్టిందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. బుధవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బన్నీ ఉత్సవాన్ని సంప్రదాయ సంబరంగా జరుపుకోవాలన్నారు. ఇప్పటికే 200 మంది ట్రబుల్ మాంగర్స్పై బైండోవర్ కేసులు నమోదు చేసి, 340 రింగ్ కర్రలు స్వాధీనం చేసుకున్నామన్నారు. 800 మంది పోలీసులతో భద్రత కల్పించామన్నారు.
News October 1, 2025
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన కర్నూలు కలెక్టర్

కర్నూలు కలెక్టర్ డాక్టర్ సిరి నగరంలోని భగత్ సింగ్ నగర్లో పెన్షన్లను పంపిణీ చేశారు. అలాగే సి క్యాంపు రైతు బజార్లో సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం వల్ల కలిగే ప్రయోజనాలను కలెక్టర్ వ్యాపారులకు, ప్రజలకు తెలియజేశారు. కలెక్టర్ వెంట నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్, డీఆర్డీఏ సిబ్బంది పాల్గొన్నారు.