News April 4, 2025

వైసీపీ నేతలను జైలుకు పంపడమే వారి లక్ష్యం: మేరిగ 

image

రాష్ట్రంతో పాటు నెల్లూరు జిల్లాలోనూ టీడీపీ నాయకులు కొత్త సంస్కృతిని తీసుకొస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ మేరిగ మురళి మండిపడ్డారు. నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అన్యాయంగా, అక్రమంగా వైసీపీ నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని మండిపడ్డారు. ఎంతో సౌమ్యుడిగా, మంచి పేరున్న కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టటం దారుణమన్నారు.

Similar News

News April 8, 2025

నెల్లూరు: నమ్మించి మోసం చేశాడు..!

image

కావలి ముసునూరుకు చెందిన చంద్రకాంత్ అనే వ్యక్తి తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని గుడ్లూరు పరిధికి చెందిన మహిళ సోమవారం ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడు తన వద్ద రూ.3 లక్షల నగదు తీసుకున్నాడని, శారీకరంగా కలిశాక పెళ్లి చేసుకుందామని అడిగితే ముఖం చాటేస్తున్నాడని వాపోయింది. పోలీసులు విచారించి తనకు న్యాయం చేయాలని వేడుకుంది.

News April 7, 2025

కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

image

హై కోర్టులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సోమవారం వాదనలు ముగిశాయి. క్వార్జ్ మైనింగ్ కేసులో నమోదైన కేసు నుంచి ముందస్తు బెయిల్ కోరుతూ కాకాణి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇరు వర్గాల నుంచి వాదనలు విన్న కోర్ట్ తీర్పును రిజర్వ్ చేసింది.

News April 7, 2025

కాకాణికి ఊరట లభించేనా..?

image

క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. ఆయనపై అట్రాసిటీ కేసు కూడా నమోదు కావడంతో బెయిల్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు విచారణ జరగ్గా నేడు మరోమారు హైకోర్టులో కాకాణి బెయిల్‌పై వాదనలు జరగనున్నాయి. మరోవైపు కాకాణి ఎక్కడున్నారనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

error: Content is protected !!