News November 11, 2025

వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు పారిపోయారు: సీఎం

image

AP: సంక్షేమం, అభివృద్ధిలో ఏపీ బ్రాండ్‌ను మళ్లీ తీసుకొస్తున్నామని CM చంద్రబాబు చెప్పారు. ప్రతి ఇంట్లో ఓ పారిశ్రామికవేత్త ఉండాలనేది తమ లక్ష్యమన్నారు. ప్రకాశం(D) కనిగిరిలో MSMEల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘YCP పాలనలో బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు పారిపోయారు. మా హయాంలో పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి 50కి.మీలకు ఒక పోర్టు నిర్మిస్తాం’ అని పేర్కొన్నారు.

Similar News

News November 11, 2025

చింతపండుతో శరీరంలోని మైక్రో ప్లాస్టిక్ ఔట్!

image

చింతపండు మైక్రోప్లాస్టిక్‌లతో పోరాడగలదని కొత్త అధ్యయనంలో తేలింది. దీనిలోని ఆమ్లాలు, ఫైబర్స్ జీర్ణవ్యవస్థలో ఉన్న మైక్రోప్లాస్టిక్ కణాలను బంధించి, వాటిని సహజంగా శరీరం నుంచి బయటకు పంపడానికి సహాయపడతాయి. ఆహారం, నీటి ద్వారా శరీరంలోకి చేరే మైక్రో ప్లాస్టిక్‌ను ఇది తొలగిస్తుంది. కాలేయ శుద్ధి, జీర్ణక్రియకు సహాయపడే ఈ చింతపండు ఇప్పుడు ఆధునిక కాలుష్యం నుంచి కూడా రక్షించగలదని ఈ పరిశోధన సూచిస్తోంది.

News November 11, 2025

ఆపరేషన్ సిందూర్ 2.0 స్టార్ట్ అవుతుందా?

image

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడుకు పాకిస్థాన్ కేంద్రంగా పని చేసే జైషే మహమ్మదే కారణమని నేషనల్ మీడియా చెబుతోంది. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత జరిగిన మరో ఉగ్రదాడి ఇదే. దీంతో ‘భారత గడ్డపై మరోసారి దాడి జరిగితే సహించేది లేదు’ అని ప్రధాని మోదీ ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇచ్చిన హెచ్చరికలను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. దీంతో మరోసారి భారత్ యుద్ధం చేస్తుందా? అని పలువురు పోస్టులు చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News November 11, 2025

తెలంగాణ న్యూస్

image

⋆ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో CID విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ.. గంటపాటు విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన అధికారులు
⋆ HYD: ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ MLAలు బీర్ల ఐలయ్య, రామచంద్రు నాయక్, రామదాసుపై మధురా నగర్ పీఎస్‌లో కేసు నమోదు.. BRS నేతలు వినయ్ భాస్కర్, ఆనంద్‌పై బోరబండ పీఎస్‌లో కేసు నమోదు
⋆ మరో గంటలో ముగియనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌