News February 14, 2025
వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా చిట్లూరు రమేశ్ గౌడ్

వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా అనంతపురానికి చెందిన చిట్లూరు రమేశ్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రమేశ్ గౌడ్ మాట్లాడుతూ.. వైసీపీలో తనకు రాష్ట్రస్థాయి పదవిని కల్పించిన పార్టీ అధినేత వైఎస్ జగన్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.
Similar News
News July 5, 2025
అంబేడ్కర్ కోనసీమ వైసీపీ జిల్లా కార్యదర్శిగా శ్రీనివాస్

అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైసీపీ కార్యదర్శిగా మామిడికుదురు(M) పాసర్లపూడికి చెందిన పిల్లి శ్రీనివాస్ ను నియమించారు. దీనికి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం ఆదేశాలు వెలువడ్డాయి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని శ్రీనివాస్ చెప్పారు.
News July 5, 2025
NTR: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APCRDAలో కాంట్రాక్ట్ పద్ధతిన 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్విరాన్మెంట్ స్పెషలిస్ట్ (2), ఎన్విరాన్మెంటలిస్ట్ (1), ప్రాజెక్టు ఇంజినీర్-సస్టైనబిలిటీ(1) పోస్టులను ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నట్లు కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 18లోపు https://crda.ap.gov.in/లో దరఖాస్తు చేయాలన్నారు. వివరాలకు పైన ఇచ్చిన వెబ్సైట్ చూడాలన్నారు.
News July 5, 2025
మామిడి సమస్యపై ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడం లేదు?

చిత్తూరు: మామిడి రైతుల సమస్య పొలిటికల్ టర్న్ తీసుకుందనే చెప్పాలి. వైసీపీ నాయకులు మామిడి మద్దతు ధర విషయమై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదే సమయంలో వైఎస్ జగన్ 9న బంగారుపాళ్యంలో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకోనున్నారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు మినహా మరే ఎమ్మెల్యేలు స్పందించకపోవడం గమనార్హం. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు స్పందించినా వైసీపీ విమర్శలను తిప్పి కొట్టేలా లేవనే వాదనలు వినిపిస్తున్నాయి.