News February 19, 2025
వైస్ ఛాన్స్లర్లుగా ఏయూ ఆచార్యులు

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు నూతన ఉప కులపతులుగా నియమితులయ్యారు. ఆంధ్ర యూనివర్సిటీ ఆంగ్ల విభాగ సీనియర్ ఆచార్యులు ఏ.ప్రసన్నశ్రీ రాజమండ్రిలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్ఛాన్సలర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. అదేవిధంగా ఏయూలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ ఆచార్యులు కె.రాంజీ మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా నియమింపబడ్డారు.
Similar News
News January 1, 2026
విశాఖ జిల్లా అధికారులకు కలెక్టర్ సూచన

న్యూఇయర్ వేడుకల వేళ విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సరికొత్త ఆలోచన చేశారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని అధికారులు, సిబ్బంది పూల బొకేలు, స్వీట్లు కాకుండా పేదలకు, అనారోగ్య బాధితులకు ఉపయోగపడే విధంగా నెలకొల్పిన సంజీవని నిధికి విరాళాలు అందించాలని ఆయన సూచించారు. కలెక్టర్ తన కార్యాలయంలో గురువారం ఉదయం 9.30 నుంచి అందుబాటులో ఉంటారు.
News January 1, 2026
పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ నేతృత్వంలో విశాఖలో పోక్సో చట్టంపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది. పోక్సో కేసుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. నిందితుల్లో అధిక శాతం పరిచయస్తులే ఉంటున్నందున, తల్లిదండ్రులు పిల్లలపై నిరంతర నిఘా ఉంచాలని కోరారు. కేసుల త్వరితగతిన పరిష్కారానికి పోలీసు, వైద్య శాఖల సహకారం కీలకమని, ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.
News January 1, 2026
పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ నేతృత్వంలో విశాఖలో పోక్సో చట్టంపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది. పోక్సో కేసుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. నిందితుల్లో అధిక శాతం పరిచయస్తులే ఉంటున్నందున, తల్లిదండ్రులు పిల్లలపై నిరంతర నిఘా ఉంచాలని కోరారు. కేసుల త్వరితగతిన పరిష్కారానికి పోలీసు, వైద్య శాఖల సహకారం కీలకమని, ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.


