News March 19, 2025

వై.రామవరం: పూడ్చిపెట్టిన మృతదేహానికి పోస్టుమార్టం

image

వై.రామవరం మండలం పెద్దఊలెంపాడులో మంగళవారం పూడ్చిపెట్టిన బాలుడి మృతదేహానికి ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోస్టుమార్టం జరిగింది. ఈ నెల8న 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో పెద్దఊలెంపాడుకు చెందిన జాస్విక్ రెడ్డి(3) మృతి చెందాడు. 9న మృతదేహాన్ని ఖననం చేశారు. గ్రామస్థుల సూచనతో బాలుడి తల్లి మార్చి 17వతేదీ రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోస్టుమార్టం చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.

Similar News

News February 28, 2026

WNP: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

image

వనపర్తి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి స్పష్టం చేశారు. అర్హత కలిగిన పాఠశాలలు తమ దరఖాస్తులను మార్చి 25 వరకు ఎస్సీ అభివృద్ధి కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఎంపికైన విద్యార్థులకు డేకం విద్యార్థులకు రూ.28 వేలు, రెసిడెన్షియల్ విద్యార్థులకు రూ.42 వేలు చొప్పున చెల్లిస్తుందన్నారు.

News February 28, 2026

గల్ఫ్‌లో ఉన్న తెలుగువాళ్లు జాగ్రత్త!

image

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్‌లో ఉన్న తెలుగువాళ్లు జాగ్రత్తగా ఉండాలని ఇక్కడి వారి బంధువులు కోరుకుంటున్నారు. యుద్ధం వార్తలు చూసి వాళ్లు ఎలా ఉన్నారో? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు UAE, సౌదీ అరేబియా, జోర్డాన్‌తో పాటు గల్ఫ్ ప్రాంతాల్లోని IND ఎంబసీలు అడ్వైజరీలు జారీ చేశాయి. అవసరమైతేనే ప్రయాణాలు చేయాలన్నాయి. మరోవైపు మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల నడుమ దుబాయ్ ఎయిర్‌పోర్టును క్లోజ్ చేశారు.

News February 28, 2026

HYDలో కీలక నిర్ణయం.. ఇక ప్రతి ఆదివారం..!

image

గ్రేటర్ పౌరుల ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధిత సమస్యలకు వేగవంతమైన పరిష్కారం కల్పించేందుకు జీహెచ్ఎంసీ చర్యలకు దిగింది. ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (PTP) కార్యక్రమాన్ని వచ్చే మార్చి నెలలో ప్రతి ఆదివారం నిర్వహించనున్నట్లు కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. అధికారులు పన్ను సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరిస్తారు.