News March 19, 2025
వై.రామవరం: పూడ్చిపెట్టిన మృతదేహానికి పోస్టుమార్టం

వై.రామవరం మండలం పెద్దఊలెంపాడులో మంగళవారం పూడ్చిపెట్టిన బాలుడి మృతదేహానికి ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోస్టుమార్టం జరిగింది. ఈ నెల8న 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో పెద్దఊలెంపాడుకు చెందిన జాస్విక్ రెడ్డి(3) మృతి చెందాడు. 9న మృతదేహాన్ని ఖననం చేశారు. గ్రామస్థుల సూచనతో బాలుడి తల్లి మార్చి 17వతేదీ రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోస్టుమార్టం చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.
Similar News
News March 19, 2025
ఈ ఏడాది ఆ క్రేజీ మూవీకి పార్ట్-2!

క్రేజీ దర్శకుడు తరుణ్ భాస్కర్ కీలక అప్డేట్ ఇచ్చారు. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి పార్ట్-2 తీయనున్నట్లు హింట్ ఇచ్చారు. ఈ మేరకు ఇన్స్టాలో ఈ సంవత్సరం కొన్ని బాకీలు తీర్చాలని పోస్ట్ చేశారు. దీంతో ENE2 రాబోతుందని సోషల్ మీడియాలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2018లో విడుదలైన ఈ నగరానికి ఏమైంది మూవీ యువతను విశేషంగా ఆకట్టుకుంది.
News March 19, 2025
ఈ నగరాల్లో జీవనం కాస్ట్లీ గురూ!

ఇండియాలోని బెంగళూరులో జీవించడం చాలా కాస్ట్లీ అని ఓ అధ్యయనంలో వెల్లడైంది. నగరాలు అక్కడి ఖర్చులను పోల్చుతూ నెలకు ఎంత డబ్బు అవసరం అవుతుందో తెలిపింది. బెంగళూరులో నివసించేందుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి నెలకు ₹35,887 అవసరమని పేర్కొంది. ముంబైలో ₹33,321, ఢిల్లీలో ₹33,308, పుణేలో ₹32,306, HYDలో ₹31,253, అహ్మదాబాద్లో ₹31,048, చెన్నైలో ₹29,276 అవసరం. కాగా వ్యక్తుల అవసరాలను బట్టి ఇందులో మార్పులుండొచ్చు.
News March 19, 2025
ఐపీఎల్లో రాణిస్తే టెస్టుల్లో చోటు ఎలా?: అశ్విన్

ఆటగాళ్ల ప్రదర్శనను ఆయా ఫార్మాట్ల వారీగా పరిగణనలోకి తీసుకోవాలని అశ్విన్ అన్నారు. ‘T20ల్లో రాణిస్తే ODI/టెస్టులకు, టెస్టుల్లో రాణిస్తే T20లకు తీసుకోవాలని జనం అంటుంటారు. ఇది కరెక్ట్ కాదు. IPLలో రాణిస్తే T20Iకు మాత్రమే తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. శ్రేయస్ గురించి మాట్లాడుతూ ‘IPLలో కెప్టెన్గా రాణిస్తే టెస్టుల్లో చోటు ఎలా దక్కుతుంది? CTలో అతను బాగా ఆడాడు. IPLలోనూ రాణిస్తాడు’ అని పేర్కొన్నారు.